LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Anganwadi New: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఒంటిపూట సమయాలు ఖరారు.!!

Anganwadi New: తెలంగాణలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా అంగన్‌వాడీ కేంద్రాల పనివేళలను ప్రభుత్వం మార్చింది. ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే కేంద్రాలు పనిచేస్తాయి

AndhraPravasi News Desk 2 min read
Anganwadi New: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఒంటిపూట సమయాలు ఖరారు.!!

Anganwadi New: తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలయ్యాయి. మార్చి నెలారంభం నుండే ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత అధికమవుతుండటంతో చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల మాదిరిగానే అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా ఒంటిపూట  అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు ఏప్రిల్ 23వ తేదీ వరకు కేవలం ఉదయం పూట మాత్రమే పనిచేస్తాయి. ప్రతిరోజూ ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే ఈ కేంద్రాలు తెరిచి ఉంటాయి. ఎండల తీవ్రత దృష్ట్యా పిల్లలు వడదెబ్బకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేసినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 23 తర్వాత ఈ కేంద్రాలకు నెల రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.

సమయాలు మారినప్పటికీ, లబ్ధిదారులకు అందే సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. గర్భిణీలు, బాలింతలు  చిన్న పిల్లలకు అందించే పౌష్టికాహారం పంపిణీ యథావిధిగా కొనసాగుతుంది. కేంద్రాలు త్వరగా మూసివేసినప్పటికీ, 'టేక్ హోమ్ రేషన్' పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా పోషకాహారాన్ని చేరవేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. తద్వారా పౌష్టికాహార లోపం తలెత్తకుండా సమతుల్యతను కాపాడుతున్నారు.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణలోని అంగన్‌వాడీల బలోపేతానికి ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని సుమారు 5,008 అంగన్‌వాడీ కేంద్రాలను సక్షమ్ అంగన్‌వాడీ లుగా ఆధునీకరించాలని నిర్ణయించింది. దీనికోసం సుమారు రూ. 30 కోట్ల నిధులను కేటాయించారు. ఈ కొత్త విధానం కింద అంగన్‌వాడీల్లో డిజిటల్ లెర్నింగ్ కోసం LED స్క్రీన్‌లు, స్వచ్ఛమైన నీటి కోసం వాటర్ ఫిల్టర్లు  పోషక విలువలున్న మొక్కలతో కూడిన పెరటి తోటలను ఏర్పాటు చేయనున్నారు.

ఈ మార్పుల వల్ల అంగన్‌వాడీ కేంద్రాలు కేవలం ఆహారం అందించే కేంద్రాలుగా మాత్రమే కాకుండా, బాల్య దశలో విద్యాబోధన చేసే అత్యుత్తమ వేదికలుగా మారనున్నాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఏడాది కూడా పాత పద్ధతినే కొనసాగిస్తూ సెలవులు ప్రకటించడంపై అంగన్‌వాడీ కార్యకర్తలు  తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవి తీవ్రత తగ్గే వరకు పిల్లల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…