LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Palla Srinivasa Rao: సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ స్ఫూర్తితో ఖర్చు తగ్గింపుకు పల్లా ముందడుగు! గ్రీన్ ఛానల్‌కు గుడ్‌బై!

Palla Srinivasa Rao: విశాఖపట్నంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. “నా దేశం–నా బాధ్యత” అనే భావనతో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంతో పాటు ఇంధన పొదుపుకు ప్రాధాన్యం ఇస్తూ ఆయన తన కాన్వాయ్‌…

AndhraPravasi News Desk 2 min read
Palla Srinivasa Rao: సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ స్ఫూర్తితో ఖర్చు తగ్గింపుకు పల్లా ముందడుగు! గ్రీన్ ఛానల్‌కు గుడ్‌బై!

కాన్వాయ్ కుదించిన పల్లా శ్రీనివాసరావు.. బుల్లెట్ ప్రూఫ్ వాహనం తిరిగి అప్పగింత.. 

భద్రతా సిబ్బందిని తగ్గించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా..

విశాఖపట్నంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. “నా దేశం–నా బాధ్యత” అనే భావనతో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంతో పాటు ఇంధన పొదుపుకు ప్రాధాన్యం ఇస్తూ ఆయన తన కాన్వాయ్‌ను కుదించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచిస్తున్న బాధ్యతాయుత విధానాల స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

తనకు వై-కేటగిరీ భద్రతలో భాగంగా కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇకపై వినియోగించబోనని నిర్ణయించిన పల్లా శ్రీనివాసరావు, ఆ వాహనాన్ని పోలీస్ శాఖకు తిరిగి అప్పగించారు. అలాగే భద్రతా వ్యవస్థను కూడా తగ్గిస్తూ 2+2 గన్‌మెన్ల స్థానంలో 1+1 భద్రతా సిబ్బంది సరిపోతారని సూచించారు. గ్రీన్ ఛానల్ సౌకర్యాలు, అధిక ఎస్కార్ట్ వాహనాలను ఉపయోగించకుండా తన సొంత వాహనంలోనే నియోజకవర్గ పర్యటనలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సూచించారని గుర్తు చేశారు. దేశ ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ దుబారా ఖర్చులను తగ్గించి పొదుపు అలవాటు చేసుకోవాలని సీఎం చంద్రబాబు కూడా పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఆ సూచనలను ఆచరణలో చూపించాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.

“ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా ఉండటం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత” అని పల్లా పేర్కొన్నారు. “నా దేశం–నా బాధ్యత” అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని సీఎం ఇచ్చిన పిలుపు తనను ప్రభావితం చేసిందన్నారు.

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ మహానాడుపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే మహానాడును ఈసారి సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ-డిజిటల్, ఆన్‌లైన్ వేదికల ద్వారా నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ఖర్చు తగ్గింపుతో పాటు ఆధునిక విధానాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…