LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Palla Srinivasa Rao: దక్షిణ కోస్తా రైల్వే జోన్ తెలుగు ప్రజల చారిత్రాత్మక విజయం.. పల్లా కీలక వ్యాఖ్యలు!

Palla Srinivasa Rao: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావం తెలుగు ప్రజల ఎన్నో ఏళ్ల కలకు నాంది పలికిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.

AndhraPravasi News Desk 2 min read
Palla Srinivasa Rao: దక్షిణ కోస్తా రైల్వే జోన్ తెలుగు ప్రజల చారిత్రాత్మక విజయం.. పల్లా కీలక వ్యాఖ్యలు!

జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు..

తెలుగు వారి దశాబ్దాల కల సాకారం చేసిన రైల్వే జోన్..

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావం తెలుగు ప్రజల ఎన్నో ఏళ్ల కలకు నాంది పలికిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభం కానుండటాన్ని ఆయన చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ విజయాన్ని ప్రతి తెలుగు వాడి గెలుపుగా భావిస్తున్నానని, రైల్వే జోన్ సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో భాగస్వామి కావడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు.

విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రధాన హామీల్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఒకటని గుర్తు చేశారు. దశాబ్దాలుగా ప్రజలు చేసిన పోరాటం, ప్రజాప్రతినిధుల కృషి, తెలుగు ప్రజల ఆకాంక్షల ఫలితంగానే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడిందన్నారు.

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడిన ఈ జోన్ పరిధిలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. రైల్వే పరిపాలనలో వేగం పెరగడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త రైల్వే ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాల కల్పనలో ఈ జోన్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా ఇది కొత్త ఊపునిస్తుందన్నారు.

దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కట్టుబడి పనిచేస్తోందని పల్లా పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడం ప్రజల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావాన్ని తెలుగు ప్రజల విజయోత్సవంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఈ చారిత్రాత్మక సందర్భాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. ప్రతి నియోజకవర్గం, పట్టణం, గ్రామంలో సంబరాలు జరిపి, సమీప రైల్వే స్టేషన్లు, రైల్వే బోర్డుల వద్ద మిఠాయిలు పంచుకుని ఆనందాన్ని పంచుకోవాలని సూచించారు.

ఇది కేవలం పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, సంకల్పానికి దక్కిన గౌరవమని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావంతో రాష్ట్ర ప్రగతికి కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని, ఈ విజయాన్ని ప్రతి ఒక్కరూ తమ విజయంగా భావించాలని ఆయన ఆకాంక్షించారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…