నారా భువనేశ్వరి తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పవిత్ర కార్యంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతం అని ఆమె అన్నారు.
తాగేందుకు, పంటలు పండించేందుకు నీటి కొరత లేకుండా కృష్ణా నదీ జలాలను కుప్పంకు తీసుకువచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆమె చెప్పారు.
కుప్పంలో నీటి కరువు అనేది లేకుండా చూడటమే చంద్రబాబు లక్ష్యం అని ఆమె స్పష్టం చేశారు. కేవలం కుప్పం తో పాటు రాష్ట్రంలో ఉన్న రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా చూసే చర్యలను చంద్రబాబు నాయుడు చేపడుతున్నారని వివరించారు.
ఈ కృషి ద్వారా రైతులకు గొప్ప ఊరట లభిస్తుందని ఆమె అన్నారు. కుప్పానికి రూ. 23,000 కోట్ల అంచనా వ్యయంతో ఏడు పరిశ్రమలను తీసుకురావడం జరిగిందని నారా భువనేశ్వరి తెలిపారు.
ఈ ఏడు పరిశ్రమలలో మూడు పరిశ్రమలు కేవలం మహిళల అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడే విధంగా తీసుకువచ్చారని చెప్పారు. ఈ ప్రయత్నం ద్వారా మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
పరిశ్రమలతో పాటుగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కూడా కుప్పంలో జరుగుతుందని ఆమె తెలియజేశారు.
చంద్రబాబు నాయుడుకి కుప్పం ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆమె ప్రసంగం ముగించారు.