LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Minister Savita: రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలు ఏర్పాటు.. ఇందులో భాగంగా ప్రతి ఇంటి నుంచి.!

Minister Savita: రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు…

AndhraPravasi News Desk 2 min read
Minister Savita: రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలు ఏర్పాటు.. ఇందులో భాగంగా ప్రతి ఇంటి నుంచి.!
  • ఎంఎస్ఎంఈలతో యువతకు ఉపాధి..
     
  • Politics: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత..

Minister Savita: రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఆసక్తి కలిగిన యువత ముందుకొస్తే సబ్సిడీ రుణాలు అందజేసి, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటుకు వెన్నుదన్నుగా ఉంటామన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని కొండంపల్లి గ్రామంలో ఫెర్టిలైజర్స్, పౌల్ట్రీ ఫీడ్ విక్రయ శాలలను మంత్రి సవిత శుక్రవారం ప్రారంభించారు. అనంతరం తనను కలిసి విలేకరులతో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన యువతతో చిన్న, మధ్యతరహా పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందజేసి, వారికి వెన్నుదన్నుగా నిలువనుందని మంత్రి సవిత వెల్లడించారు.

కూటమి రాకతో పంచాయతీలకు పూర్వవైభవం
వైసీపీ పాలనలో నిధుల లేమితో పంచాయతీల్లో పాలన పడకేసిందని మంత్రి సవిత మండిపడ్డారు. పాడైపోయిన వీధి బల్బులను సైతం మార్చడానికి కూడా వీలుండేది కాదన్నారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఎందరో వైసీపీ సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మరెందరో చేసిన అప్పులు తీర్చడానికి కూలీలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను ఆనాటి జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించారన్నారు. పంచాయతీలను దౌర్జన్యంగా గెలిపించుకోవడంలో ఉన్న శ్రద్ధ నిధులివ్వడంపై లేదని జగన్ నుద్దేశించి విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాకతో పంచాయతీలకు పూర్వవైభవం ప్రారంభమైందన్నారు. కేంద ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు నేరుగా పంచాయతీలకే అందజేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల కాలంలో గ్రామాల్లో గతంలో ఎన్నడూ జరగలేనంత అభివృద్ధి చోటుచేసుకుందన్నారు. 2025-26కు సంబంధించి గ్రామాల్లో జరిగిన అభివృద్ధికి గానూ ప్రతిష్టాత్మక అయిదు  కేంద్ర ప్రభుత్వ అవార్డులను ఏపీ పంచాయతీరాజ్ శాఖ గెలుచుకుందన్నారు. ఇదీ కూటమి ప్రభుత్వం పాలనకు మచ్చుతునక అని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…