LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

West Bengal: పశ్చిమబెంగాల్‌లో రేపు రీపోలింగ్.. అవకతవకలపై ఈసీ చర్యలు!

West Bengal: పశ్చిమబెంగాల్‌లో జరిగిన రెండో విడత పోలింగ్‌లో చోటుచేసుకున్న అవకతవకల నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 15 పోలింగ్ కేంద్రాల్లో రేపు మళ్లీ పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

AndhraPravasi News Desk 1 min read
West Bengal: పశ్చిమబెంగాల్‌లో రేపు రీపోలింగ్.. అవకతవకలపై ఈసీ చర్యలు!

రెండో విడత పోలింగ్ లో అవకతవకలు జరిగాయన్న ఈసీ..

మగర్‌హత్ పశ్చిమ, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లో రీపోలింగ్..

పశ్చిమబెంగాల్‌లో జరిగిన రెండో విడత పోలింగ్‌లో చోటుచేసుకున్న అవకతవకల నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 15 పోలింగ్ కేంద్రాల్లో రేపు మళ్లీ పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రజాస్వామ్య ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఈసీ తెలిపింది.

రీపోలింగ్ రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మగర్‌హత్ పశ్చిమ, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన నేపథ్యంలో అక్కడి పోలింగ్ కేంద్రాల్లో తిరిగి ఓటింగ్ నిర్వహించనున్నారు.

అలాగే ఫాల్టా ప్రాంతంలో కూడా అక్రమాలు జరిగాయని పలు ఫిర్యాదులు అందినట్లు ఈసీ తెలిపింది. అయితే ఫాల్టాకు సంబంధించిన పూర్తి నివేదిక ఇంకా అందాల్సి ఉందని, అది వచ్చిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

ప్రజల ఓటు హక్కు విలువను కాపాడేందుకు ఎలాంటి లోపాలు లేకుండా ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని ఈసీ స్పష్టం చేసింది. రీపోలింగ్ ద్వారా ప్రతి ఓటు సరైన రీతిలో లెక్కించబడేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, పశ్చిమబెంగాల్‌తో పాటు తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న ప్రకటించనున్నారు. ఫలితాల కోసం ప్రజలు, రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…