LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!!

Prajavedhika: ఈరోజు ప్రజా వేదికలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని ప్రజల సమస్యల వినతులను స్వీకరించారు.

AndhraPravasi News Desk 2 min read
Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!!

Prajavedhika: అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా జరిగిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమం బాధితుల పాలిట ఆశాకిరణంగా నిలిచింది. గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరైన ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు, అధికారుల నిర్లక్ష్యం మరియు కబ్జాదారుల వేధింపులపై అందిన ఫిర్యాదులను మంత్రి సావధానంగా విన్నారు. సామాన్యుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించి వారికి న్యాయం చేయడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

నెల్లూరుకు చెందిన ప్రశాంతి అనే మహిళ తన ఇబ్బందులను వివరిస్తూ, గత ప్రభుత్వ హయాంలో తనకు పెన్నా నది పరివాహక ప్రాంతంలోని కట్టపై ఇంటి స్థలం కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలు వచ్చిన ప్రతిసారీ ప్రాణభయంతో గడపాల్సి వస్తోందని, ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా మహిళల భద్రతకు అక్కడ ముప్పు పొంచి ఉందని, తనకు నివాసయోగ్యమైన చోట ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని ఆమె మంత్రిని కోరారు. ఇసుక మాఫియా కదలికలు కూడా ఆ ప్రాంతంలో అధికంగా ఉన్నాయని ఆమె అర్జీలో పేర్కొన్నారు.

మరోవైపు, సొంత నిధులతో గ్రామాభివృద్ధి చేసినా అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని కర్నూలు జిల్లా ముత్తుకూరుకు చెందిన కె. హరినారాయణ వాపోయారు. పార్టీపై అభిమానంతో, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలనే సంకల్పంతో గ్రామంలో గ్రావెల్ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. పనులు పూర్తై, అధికారులు తనిఖీలు చేసి కొలతలు తీసుకున్నప్పటికీ, బిల్లుల మంజూరులో ఎంపీడీవో మరియు ఈవోలు కాలయాపన చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు మరియు గ్రామస్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన మంత్రికి విన్నవించారు.

భూ వివాదాలు మరియు కబ్జాల అంశం కూడా ఈ గ్రీవెన్స్‌లో ప్రధానంగా వినిపించింది. అనంతపురానికి చెందిన భాస్కరమ్మ తన వారసత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేశారని, కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని మంత్రి దృష్టికి తెచ్చారు. అదేవిధంగా కర్నూలు జిల్లా హులేబీడు గ్రామానికి చెందిన మాలాభి తన భూమికి సర్వే చేయించుకున్నా, పక్కనే ఉన్న భూయజమానులు సరిహద్దు రాళ్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం తమ భూమికి రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.

వీటితో పాటు పింఛన్లు, రేషన్ కార్డులు మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధితులు ఆర్థిక సహాయం కోసం మంత్రిని ఆశ్రయించారు. నిరుద్యోగులు తమ ఉద్యోగ అవకాశాల కోసం రెస్యూమ్ లు అందజేశారు. వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి సంధ్యారాణి, సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే ప్రభుత్వ బాధ్యతని, ఏ ఒక్కరూ నిరాశతో వెనుదిరగకూడదని ఆమె భరోసా ఇచ్చారు.

 

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…