తేదీ 30-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్.
తేదీ: 30 డిసెంబర్ 2025 (మంగళవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి.
1. శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు (గౌరవనీయ మంత్రి).
2. శ్రీ కే.కే. చౌదరి గారు (ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్)
తేదీ 29-12-2025 (సోమవారం) న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా వేదిక” కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యింది. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించారు. కార్యక్రమానికి గౌరవనీయ మంత్రి శ్రీమతి గుమ్మడి సంద్యారాణి గారు ముఖ్య అతిథిగా హాజరై, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రైతులకు సంబంధించిన అంశాలు, వ్యవసాయ రంగ అభివృద్ధిపై మాట్లాడారు. ప్రజా వేదిక ద్వారా ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సమస్యలను పార్టీ నాయకత్వం గమనించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.