LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Polavaram: గోదావరి పుష్కరాల నాటికి టూరిజం హబ్‌గా పోలవరం.. మంత్రి నిమ్మల సమీక్ష!

Polavaram: 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

AndhraPravasi News Desk 2 min read
Polavaram: గోదావరి పుష్కరాల నాటికి టూరిజం హబ్‌గా పోలవరం.. మంత్రి నిమ్మల సమీక్ష!

పోలవరం అభివృద్ధికి వేగం.. పుష్కరాల ముందు కీలక పనులు పూర్తి చేయాలని ఆదేశాలు..

పోలవరం చుట్టూ పర్యాటక అభివృద్ధి.. 9,900 ఎకరాల్లో ప్రణాళికలు..

అమరావతి: 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నామని, పనులను వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు.

బుధవారం అమరావతి సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, డిజైన్ నిపుణులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు 9,900 ఎకరాల విస్తీర్ణంలో లైడార్ సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. ఆ సర్వే ఆధారంగా సమగ్ర లేఅవుట్ ప్లాన్, డిజైన్‌లను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

పోలవరం ప్రాజెక్టును ఏలూరు, కొవ్వూరు, రాజమహేంద్రవరం నగరాలతో జాతీయ రహదారుల ద్వారా అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి వెల్లడించారు. దీంతో భవిష్యత్తులో పర్యాటకులకు రాకపోకలు మరింత సులభం అవుతాయని పేర్కొన్నారు.

ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే దిగువ భాగంలో నిర్మించనున్న వంతెన పనులకు సంబంధించిన డిజైన్లు, అనుమతులు మరియు ఇతర ప్రక్రియలపై స్పష్టమైన షెడ్యూల్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తయ్యేలా కాలయాపన లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పోలవరం నిర్మాణ పనుల పురోగతిని వివరిస్తూ, ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు గ్యాప్-1లో 45 శాతం, గ్యాప్-2లో 22 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. అలాగే ఎడమ ప్రధాన కాలువ పనులను ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేసి, గోదావరి జలాలను అనకాపల్లి వరకు తరలించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.

కుడి, ఎడమ ప్రధాన కాలువల టన్నెల్ కనెక్టివిటీ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి, గోదావరి పుష్కరాల నాటికి పోలవరాన్ని అభివృద్ధి, పర్యాటక రంగాల్లో ఆదర్శ ప్రాజెక్టుగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశి భూషణ్ కుమార్, జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈ రామచంద్రరావు, మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు అంగర సతీష్ బాబు, మురళీ తదితర అధికారులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…