LIVE
Chandrababu: ప్రజల నమ్మకం పెంచేందుకు జూలై నుంచి అధికారుల క్షేత్ర పర్యటనలు తప్పనిసరి.. సీఎం చంద్రబాబు ఆదేశాలు!  •  Chandrababu: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా పంటల సాగు విధానాలు రూపొందించాలి.. సీఎం చంద్రబాబు సూచనలు!  •  Yoga: సంజీవనితో యోగాను అనుసంధానం చేసి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలి.. సీఎం చంద్రబాబు!  •  Kollu Ravindra: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. మంత్రి కొల్లు రవీంద్ర!  •  Gottipati Ravi: వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.. మార్కాపురాన్ని హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్!  •  Kollu Ravindra: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం.. మంత్రి కొల్లు రవీంద్ర!  •  Nimmala Ramanaidu: రెండేళ్ల కూటమి పాలనకు ప్రజల బ్రహ్మరథం.. మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు!  •  President: రేపటి నుంచి మధ్యప్రదేశ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పర్యటన!  •  Amarnath: అమర్‌నాథ్ యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు.. 63 మంది అధికారుల నియామకం!  •  Jal Jeevan Mission: జల్ జీవన్ మిషన్ 2.0 అమలుకు కేంద్రంతో జమ్మూ-కాశ్మీర్ ఒప్పందం!  • 
Politics

Polavaram: గోదావరి పుష్కరాల నాటికి టూరిజం హబ్‌గా పోలవరం.. మంత్రి నిమ్మల సమీక్ష!

Polavaram: 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

AndhraPravasi News Desk 2 min read
Polavaram: గోదావరి పుష్కరాల నాటికి టూరిజం హబ్‌గా పోలవరం.. మంత్రి నిమ్మల సమీక్ష!

పోలవరం అభివృద్ధికి వేగం.. పుష్కరాల ముందు కీలక పనులు పూర్తి చేయాలని ఆదేశాలు..

పోలవరం చుట్టూ పర్యాటక అభివృద్ధి.. 9,900 ఎకరాల్లో ప్రణాళికలు..

అమరావతి: 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నామని, పనులను వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు.

బుధవారం అమరావతి సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, డిజైన్ నిపుణులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు 9,900 ఎకరాల విస్తీర్ణంలో లైడార్ సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. ఆ సర్వే ఆధారంగా సమగ్ర లేఅవుట్ ప్లాన్, డిజైన్‌లను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

పోలవరం ప్రాజెక్టును ఏలూరు, కొవ్వూరు, రాజమహేంద్రవరం నగరాలతో జాతీయ రహదారుల ద్వారా అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి వెల్లడించారు. దీంతో భవిష్యత్తులో పర్యాటకులకు రాకపోకలు మరింత సులభం అవుతాయని పేర్కొన్నారు.

ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే దిగువ భాగంలో నిర్మించనున్న వంతెన పనులకు సంబంధించిన డిజైన్లు, అనుమతులు మరియు ఇతర ప్రక్రియలపై స్పష్టమైన షెడ్యూల్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తయ్యేలా కాలయాపన లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పోలవరం నిర్మాణ పనుల పురోగతిని వివరిస్తూ, ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు గ్యాప్-1లో 45 శాతం, గ్యాప్-2లో 22 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. అలాగే ఎడమ ప్రధాన కాలువ పనులను ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేసి, గోదావరి జలాలను అనకాపల్లి వరకు తరలించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.

కుడి, ఎడమ ప్రధాన కాలువల టన్నెల్ కనెక్టివిటీ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి, గోదావరి పుష్కరాల నాటికి పోలవరాన్ని అభివృద్ధి, పర్యాటక రంగాల్లో ఆదర్శ ప్రాజెక్టుగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశి భూషణ్ కుమార్, జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈ రామచంద్రరావు, మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు అంగర సతీష్ బాబు, మురళీ తదితర అధికారులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

MadanaPalli: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. మదనపల్లె టీడీపీలో కొత్త జోష్.. మహిళా అధ్యక్షురాలిగా బైగారి భారతి నాయుడు నియామకం!

MadanaPalli: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. మదనపల్లె టీడీపీలో కొత్త జోష్.. మహిళా అధ్యక్షురాలిగా బైగారి భారతి నాయుడు నియామకం!

MadanaPalli: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో కీలకమైన అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహ…

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…