Nara Lokesh: ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని... ఢిల్లీ వేదికగా లోకేశ్ గర్జన! Polavaram Update 2026: పోలవరం ప్రాజెక్టులో మరో మైలురాయి... విజయవంతంగా పూర్తయిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం! Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో చారిత్రక ఘట్టం... కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి! Prajavedhika: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ స్కామ్... భూ కబ్జాలపై బాధితుల గర్జన! గ్రీవెన్స్‌లో వెల్లువెత్తిన వైసీపీ నేతల అక్రమాల చిట్టా Amaravati Celebrations: అమరావతి గెలిచింది: గ్రామాల్లో సంబరాలు.. ఢిల్లీలో రాజకీయ కలయికలు! Minister Nimmala: పోలవరం లక్ష్యం 2027.. వచ్చే పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి.. మంత్రి నిమ్మల కీలక ప్రకటన.! Nara Lokesh: "ధర్మం గెలిచింది.. అమరావతి నిలిచింది"... మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్! AP Capital: ఇక తిరుగులేదు... అమరావతి తలరాతను మార్చేసిన ఆ 'మూజువాణి ఓటు'! Talliki Vandanam Scheme: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఖాతాల్లోకి రూ.13,000 - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!! New Pensions: కొత్త పెన్షన్ల పంపిణీ... జూన్ నుంచి అమలు! లిస్ట్ లో మీ పేరు చెక్ చేసుకోండి... Nara Lokesh: ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని... ఢిల్లీ వేదికగా లోకేశ్ గర్జన! Polavaram Update 2026: పోలవరం ప్రాజెక్టులో మరో మైలురాయి... విజయవంతంగా పూర్తయిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం! Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో చారిత్రక ఘట్టం... కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి! Prajavedhika: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ స్కామ్... భూ కబ్జాలపై బాధితుల గర్జన! గ్రీవెన్స్‌లో వెల్లువెత్తిన వైసీపీ నేతల అక్రమాల చిట్టా Amaravati Celebrations: అమరావతి గెలిచింది: గ్రామాల్లో సంబరాలు.. ఢిల్లీలో రాజకీయ కలయికలు! Minister Nimmala: పోలవరం లక్ష్యం 2027.. వచ్చే పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి.. మంత్రి నిమ్మల కీలక ప్రకటన.! Nara Lokesh: "ధర్మం గెలిచింది.. అమరావతి నిలిచింది"... మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్! AP Capital: ఇక తిరుగులేదు... అమరావతి తలరాతను మార్చేసిన ఆ 'మూజువాణి ఓటు'! Talliki Vandanam Scheme: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఖాతాల్లోకి రూ.13,000 - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!! New Pensions: కొత్త పెన్షన్ల పంపిణీ... జూన్ నుంచి అమలు! లిస్ట్ లో మీ పేరు చెక్ చేసుకోండి...

Polavaram Update 2026: పోలవరం ప్రాజెక్టులో మరో మైలురాయి... విజయవంతంగా పూర్తయిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం!

Polavaram Update 2026: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం 440 రోజుల్లోనే పూర్తి చేసింది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల కలిగిన నష్టాన్ని అధిగమించి, 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా మంత్రి నిమ్మల రామానాయుడు పనులను పరుగులు పెట్టిస్తున్నారు.

Published : 2026-04-02 18:33:00

Polavaram Update 2026: రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు దగ్గర ఈరోజు సందడి నెలకొంది. ప్రాజెక్టు పనుల్లో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం చేరుకుని పనులను పరిశీలించారు. రికార్డు సమయంలో ఈ గోడను పూర్తి చేసిన ఇంజనీర్లను, కార్మికులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. స్వయంగా అందరికీ స్వీట్లు తినిపించి,  సంతోషాన్ని పంచుకున్నారు.

గత ప్రభుత్వంపై విమర్శలు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గతంలో టీడీపీ హయాంలో ఎంతో కష్టపడి కట్టిన డయాఫ్రమ్ వాల్‌ను జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల చేతులారా నాశనం చేసిందని మండిపడ్డారు. వరదలు వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే పాత గోడ దెబ్బతిందని, దాని వల్ల ప్రాజెక్టుకు తీరని నష్టం జరిగిందని ఆయన విమర్శించారు. అసలు డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియని స్థితిలో నాటి ముఖ్యమంత్రి ఉండేవారని ఎద్దేవా చేశారు.

440 రోజుల్లోనే పూర్తి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం పనులను గాడిలో పెట్టిందని మంత్రి తెలిపారు. 2025 జనవరి 18న ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఒక సవాల్‌గా తీసుకుని ప్రారంభించామని, నేటికి 1372 మీటర్ల పొడవైన ఈ గోడను పూర్తి చేశామని చెప్పారు. కేవలం 440 రోజుల్లోనే ఇంత పెద్ద పనిని పూర్తి చేయడం ఒక రికార్డు అని ఆయన వెల్లడించారు. జగన్ చేసిన తప్పిదం వల్ల కొత్తగా ఈ గోడ కట్టడానికి ప్రజల సొమ్ము సుమారు 1000 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

మాట తప్పిన జగన్

గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పిన మాటలను మంత్రి గుర్తు చేశారు. 2020లో వరదలకు గోడ దెబ్బతింటే.. 2021 జూన్ లోనో, డిసెంబర్ లోనో పూర్తి చేస్తానని  ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని విమర్శించారు. రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం కాలయాపన చేశారని దుయ్యబట్టారు. కానీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మాట ఇస్తే మడమ తిప్పదని, పనుల వేగమే దానికి నిదర్శనమని ధీమా వ్యక్తం చేశారు.

2027 లక్ష్యంగా ముందుకు

 పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడమే తమ లక్ష్యమని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ పూర్తయింది కాబట్టి, ఇక మెయిన్ డ్యామ్ పనులు ఊపందుకుంటాయని చెప్పారు. రైతుల కల నెరవేర్చడానికి సిఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తామని మంత్రి రామానాయుడు ప్రకటించారు.

Spotlight

Read More →