AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం.. Karnataka Nara Lokesh: సింధనూరులో సెల్ఫీల సందడి: అభిమానులు, యువతతో కలిసి ముచ్చటించిన నారా లోకేష్.! Minister Gottipati: వ్యవసాయానికి 9 గంటల పగటిపూట విద్యుత్.. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల దరఖాస్తులు! మంత్రి కీలక వ్యాఖ్యలు.. Education News: సర్కార్ స్కూల్ విద్యార్థులకు వరం: 24 వస్తువులతో మెగా కిట్ పంపిణీ.! Praja Vedika: నేడు (04/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Bypass: ఏపీలో వారికి శుభవార్త... కొత్తగా మరో బైపాస్ రోడ్డు! త్వరలోనే అందుబాటులోకి... Chandrababu: గీత దాటితే సస్పెన్షనే.. జాప్రతినిధుల భవిష్యత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! టీడీపీ నేతలపై అధినేత కన్నెర్ర.. APCRDA రేంజ్ ఏంటో తెలుసా.. కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదు.. 8,603 చదరపు కిలోమీటర్ల 'మహా అమరావతి' స్వరూపం ఇదే! Srivari Brahmotsavam: దేశ రాజధానిలో వేంకటేశ్వర వైభవం: ఈ నెల 28 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు! AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం.. Karnataka Nara Lokesh: సింధనూరులో సెల్ఫీల సందడి: అభిమానులు, యువతతో కలిసి ముచ్చటించిన నారా లోకేష్.! Minister Gottipati: వ్యవసాయానికి 9 గంటల పగటిపూట విద్యుత్.. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల దరఖాస్తులు! మంత్రి కీలక వ్యాఖ్యలు.. Education News: సర్కార్ స్కూల్ విద్యార్థులకు వరం: 24 వస్తువులతో మెగా కిట్ పంపిణీ.! Praja Vedika: నేడు (04/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Bypass: ఏపీలో వారికి శుభవార్త... కొత్తగా మరో బైపాస్ రోడ్డు! త్వరలోనే అందుబాటులోకి... Chandrababu: గీత దాటితే సస్పెన్షనే.. జాప్రతినిధుల భవిష్యత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! టీడీపీ నేతలపై అధినేత కన్నెర్ర.. APCRDA రేంజ్ ఏంటో తెలుసా.. కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదు.. 8,603 చదరపు కిలోమీటర్ల 'మహా అమరావతి' స్వరూపం ఇదే! Srivari Brahmotsavam: దేశ రాజధానిలో వేంకటేశ్వర వైభవం: ఈ నెల 28 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు!

Talliki Vandanam Scheme: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఖాతాల్లోకి రూ.13,000 - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!!

Talliki Vandanam Scheme 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 2026 జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభమైన వెంటనే అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు వెల్లడించారు

Published : 2026-04-02 15:50:00

Talliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు, వారి తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సూపర్ సిక్స్’ పథకాల్లో ఒకటైన తల్లికి వందనం నిధుల విడుదలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పథకం నిధులను వచ్చే జూన్ నెలలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీఎం ఈ కీలక అప్‌డేట్ ఇచ్చారు.

వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కాలేజీలు పునఃప్రారంభం కాగానే ఈ ప్రక్రియ మొదలవుతుందని ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది కూడా ప్రభుత్వం విజయవంతంగా ఈ నిధులను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరం మొదలైన వెంటనే, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకుండా విద్యార్థులకు భరోసా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15,000 ఆర్థిక సాయం అందుతుంది. అయితే, పాఠశాలలు మరియు కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ ఖర్చుల కోసం రూ. 2,000 మినహాయించి, మిగిలిన రూ. 13,000 మొత్తాన్ని నేరుగా తల్లి బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు. ఒకవేళ విద్యార్థికి తల్లి లేని పక్షంలో తండ్రి లేదా సంరక్షకుల అకౌంట్‌లో ఈ నగదు వేస్తారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రభుత్వ  ప్రైవేట్ స్కూల్ విద్యార్థులందరికీ ఈ లబ్ధి చేకూరనుంది.

తల్లికి వందనం నిధులు పొందాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. విద్యార్థికి కనీసం 75 శాతం హాజరు ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, లబ్ధిదారులైన తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్య అనుసంధానమై ఉండటం అత్యవసరం. ఈ ప్రక్రియ పూర్తి కాని వారు వెంటనే తమ బ్యాంకును సంప్రదించి కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అకౌంట్ యాక్టివ్‌గా ఉంటేనే ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా డబ్బులు జమ అవుతాయి.

రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాల్లో భాగంగా మహిళా సాధికారతకు, విద్యకు పెద్దపీట వేస్తున్నామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. పింఛన్ల పంపిణీ, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లికి వందనం పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Spotlight

Read More →