AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం.. Karnataka Nara Lokesh: సింధనూరులో సెల్ఫీల సందడి: అభిమానులు, యువతతో కలిసి ముచ్చటించిన నారా లోకేష్.! Minister Gottipati: వ్యవసాయానికి 9 గంటల పగటిపూట విద్యుత్.. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల దరఖాస్తులు! మంత్రి కీలక వ్యాఖ్యలు.. Education News: సర్కార్ స్కూల్ విద్యార్థులకు వరం: 24 వస్తువులతో మెగా కిట్ పంపిణీ.! Praja Vedika: నేడు (04/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Bypass: ఏపీలో వారికి శుభవార్త... కొత్తగా మరో బైపాస్ రోడ్డు! త్వరలోనే అందుబాటులోకి... Chandrababu: గీత దాటితే సస్పెన్షనే.. జాప్రతినిధుల భవిష్యత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! టీడీపీ నేతలపై అధినేత కన్నెర్ర.. APCRDA రేంజ్ ఏంటో తెలుసా.. కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదు.. 8,603 చదరపు కిలోమీటర్ల 'మహా అమరావతి' స్వరూపం ఇదే! Srivari Brahmotsavam: దేశ రాజధానిలో వేంకటేశ్వర వైభవం: ఈ నెల 28 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు! AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం.. Karnataka Nara Lokesh: సింధనూరులో సెల్ఫీల సందడి: అభిమానులు, యువతతో కలిసి ముచ్చటించిన నారా లోకేష్.! Minister Gottipati: వ్యవసాయానికి 9 గంటల పగటిపూట విద్యుత్.. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల దరఖాస్తులు! మంత్రి కీలక వ్యాఖ్యలు.. Education News: సర్కార్ స్కూల్ విద్యార్థులకు వరం: 24 వస్తువులతో మెగా కిట్ పంపిణీ.! Praja Vedika: నేడు (04/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Bypass: ఏపీలో వారికి శుభవార్త... కొత్తగా మరో బైపాస్ రోడ్డు! త్వరలోనే అందుబాటులోకి... Chandrababu: గీత దాటితే సస్పెన్షనే.. జాప్రతినిధుల భవిష్యత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! టీడీపీ నేతలపై అధినేత కన్నెర్ర.. APCRDA రేంజ్ ఏంటో తెలుసా.. కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదు.. 8,603 చదరపు కిలోమీటర్ల 'మహా అమరావతి' స్వరూపం ఇదే! Srivari Brahmotsavam: దేశ రాజధానిలో వేంకటేశ్వర వైభవం: ఈ నెల 28 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు!

AmaravatiBill: చరిత్ర సృష్టించిన అమరావతి: రాజ్యసభలోనూ చట్టబద్ధత బిల్లుకు గ్రీన్ సిగ్నల్..!!

AmaravatiBill: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధమైన భరోసా కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. లోక్‌సభ తర్వాత ఎగువ సభలోనూ ఈ కీలక ఘట్టం పూర్తి కావడంతో అమరావతి చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది.

Published : 2026-04-02 17:11:00

AmaravatiBill: ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్ద కాలపు నిరీక్షణకు తెరపడింది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా స్థిరపరుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు'కు రాజ్యసభ నేడు పచ్చజెండా ఊపింది. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లు, ఎగువ సభలో కూడా నెగ్గడంతో రాజధాని అమరావతికి ఇక తిరుగులేని చట్టబద్ధత చేకూరింది. ముగిసిన చర్చ అనంతరం సభ్యులందరి మద్దతుతో బిల్లును మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు. దీనివల్ల అమరావతి నిర్మాణానికి మార్గం మరింత సుగమమైంది.

చారిత్రాత్మక ఘట్టం

ఈ సందర్భంగా సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉద్వేగభరితంగా మాట్లాడారు. విభజన సమయంలో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని, ఒక రాజధాని కూడా లేకుండా అయిదు కోట్ల మంది ప్రజలు రోడ్డున పడ్డారని గుర్తు చేశారు. గతంలో ఏర్పడిన సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుని చంద్రబాబు నాయుడు విజన్ తో అమరావతిని మొదలుపెట్టారని చెప్పారు. ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ, నేడు ఈ బిల్లు ఆమోదం పొందడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు.

రైతుల పోరాటానికి విజయం

అమరావతి కోసం సుమారు 29 వేల మంది రైతులు తమ సొంత భూములను త్యాగం చేయడం ప్రపంచ చరిత్రలోనే అద్భుతమని సభలో చర్చ సందర్భంగా పలువురు సభ్యులు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు, మహిళలు ఎదుర్కొన్న లాఠీ దెబ్బలు, అవమానాలను గుర్తు చేస్తూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. ఐదేళ్లుగా అస్పష్టతలో ఉన్న రాజధాని అంశం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చిందని, ఇది కేవలం బిల్లు ఆమోదం మాత్రమే కాదు.. న్యాయం కోసం పోరాడిన వేల మంది రైతుల విజయమని ఆయన అన్నారు.

ప్రతిపక్షాల విమర్శలు - వాకౌట్

అయితే ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో రాజకీయ వేడి కూడా కనిపించింది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ.. బిల్లుకు మద్దతు తెలుపుతూనే, విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం చేస్తున్న ఆలస్యాన్ని తప్పుబట్టారు. మరోవైపు, వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బిల్లులోని లోపాలను ఎత్తిచూపారు. రాజధాని రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన లేకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

రాజ్యసభ ఆమోదంతో ఇప్పుడు ఈ బిల్లు కేంద్ర కేబినెట్ దగ్గరకు వెళ్తుంది. అక్కడ ర్యాటిఫికేషన్ పూర్తయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చడానికి వీలుండదు. అమరావతికి ఈ భరోసా దక్కడంతో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తిరిగి రాష్ట్రం వైపు చూసే అవకాశం ఉంది. ఈ పరిణామంతో రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Spotlight

Read More →