LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Polavaram Update 2026: పోలవరం ప్రాజెక్టులో మరో మైలురాయి... విజయవంతంగా పూర్తయిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం!

Polavaram Update 2026: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం 440 రోజుల్లోనే పూర్తి చేసింది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల కలిగిన నష్టాన్ని అధిగమించి, 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా మంత్రి నిమ్మల రామానాయుడు పనులను పరుగులు పెట్…

AndhraPravasi News Desk 2 min read
Polavaram Update 2026: పోలవరం ప్రాజెక్టులో మరో మైలురాయి... విజయవంతంగా పూర్తయిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం!

Polavaram Update 2026: రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు దగ్గర ఈరోజు సందడి నెలకొంది. ప్రాజెక్టు పనుల్లో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం చేరుకుని పనులను పరిశీలించారు. రికార్డు సమయంలో ఈ గోడను పూర్తి చేసిన ఇంజనీర్లను, కార్మికులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. స్వయంగా అందరికీ స్వీట్లు తినిపించి,  సంతోషాన్ని పంచుకున్నారు.

గత ప్రభుత్వంపై విమర్శలు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గతంలో టీడీపీ హయాంలో ఎంతో కష్టపడి కట్టిన డయాఫ్రమ్ వాల్‌ను జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల చేతులారా నాశనం చేసిందని మండిపడ్డారు. వరదలు వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే పాత గోడ దెబ్బతిందని, దాని వల్ల ప్రాజెక్టుకు తీరని నష్టం జరిగిందని ఆయన విమర్శించారు. అసలు డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియని స్థితిలో నాటి ముఖ్యమంత్రి ఉండేవారని ఎద్దేవా చేశారు.

440 రోజుల్లోనే పూర్తి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం పనులను గాడిలో పెట్టిందని మంత్రి తెలిపారు. 2025 జనవరి 18న ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఒక సవాల్‌గా తీసుకుని ప్రారంభించామని, నేటికి 1372 మీటర్ల పొడవైన ఈ గోడను పూర్తి చేశామని చెప్పారు. కేవలం 440 రోజుల్లోనే ఇంత పెద్ద పనిని పూర్తి చేయడం ఒక రికార్డు అని ఆయన వెల్లడించారు. జగన్ చేసిన తప్పిదం వల్ల కొత్తగా ఈ గోడ కట్టడానికి ప్రజల సొమ్ము సుమారు 1000 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

మాట తప్పిన జగన్

గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పిన మాటలను మంత్రి గుర్తు చేశారు. 2020లో వరదలకు గోడ దెబ్బతింటే.. 2021 జూన్ లోనో, డిసెంబర్ లోనో పూర్తి చేస్తానని  ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని విమర్శించారు. రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం కాలయాపన చేశారని దుయ్యబట్టారు. కానీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మాట ఇస్తే మడమ తిప్పదని, పనుల వేగమే దానికి నిదర్శనమని ధీమా వ్యక్తం చేశారు.

2027 లక్ష్యంగా ముందుకు

 పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడమే తమ లక్ష్యమని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ పూర్తయింది కాబట్టి, ఇక మెయిన్ డ్యామ్ పనులు ఊపందుకుంటాయని చెప్పారు. రైతుల కల నెరవేర్చడానికి సిఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తామని మంత్రి రామానాయుడు ప్రకటించారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…