LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

India Iran Relations: చమురు రవాణాపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్.. ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక చర్చలు..!!

Iran Israel War 2026: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు రవాణాకు కలుగుతున్న ఆటంకాలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడి, ప్రాంతీయ శాంతి భారతీయ పౌరుల రక్షణ గురించి చర్చించిన పూర్తి వివరాలు..

AndhraPravasi News Desk 1 min read
India Iran Relations: చమురు రవాణాపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్.. ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక చర్చలు..!!

Iran Israel War 2026: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ఆయన ఫోన్‌లో  మాట్లాడారని సమాచారం. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ప్రాంతీయ భద్రత, శాంతి స్థాపనపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ముఖ్యంగా యుద్ధం కారణంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావంపై మోదీ చర్చించారు.

ప్రస్తుతం జరుగుతున్న దాడుల వల్ల చమురు, సహజవాయువు మౌలిక వసతులు దెబ్బతినడం పట్ల మోదీ ఆవేదన చెందారు. ఇలాంటి దాడులు ప్రపంచ దేశాల ఇంధన భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని ఆయన పేర్కొన్నారు. సముద్ర మార్గాల ద్వారా జరిగే నౌకా రవాణాకు ఎటువంటి ఆటంకాలు కలగకూడదని, అంతర్జాతీయ వాణిజ్యం సజావుగా సాగాలంటే ఆ ప్రాంతంలో ప్రశాంతత చాలా అవసరమని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఇదే సమయంలో, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు ప్రధాని మోదీ రంజాన్ పండుగ  ఇరాన్ నూతన సంవత్సరం 'నవ్‌రోజ్' శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇద్దరు నేతలు మాట్లాడుకోవడం ఇది రెండోసారి. చర్చల ద్వారానే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని, హింస ఎప్పటికీ దేనికీ పరిష్కారం కాదని భారత్ నమ్ముతుందని మోదీ పునరుద్ఘాటించారు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరుల రక్షణ గురించి కూడా ప్రధాని అడిగి తెలుసుకున్నారు. అక్కడ నివసిస్తున్న భారతీయులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నందుకు ఇరాన్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో ఇరు దేశాలు సమన్వయంతో పనిచేయాలని వారు నిర్ణయించుకున్నారు. పశ్చిమాసియాలో త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని, శాంతి సుస్థిరతలు మళ్లీ నెలకొంటాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని దేశాలు సంయమనం పాటించి, శాంతి చర్చలకు మొగ్గు చూపాలని ఆయన కోరారు. ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రాంతం వైపు ఆశగా చూస్తున్న తరుణంలో మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…