LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Mahanadu: మహిళలు, యువత రాజకీయాల్లో ముందుకు రావాలి.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి!

Mahanadu: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి.

AndhraPravasi News Desk 1 min read
Mahanadu: మహిళలు, యువత రాజకీయాల్లో ముందుకు రావాలి.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి!

కార్యకర్తే పార్టీకి వెన్నెముక : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..

స్త్రీశక్తి, యువగళంపై మహానాడులో విస్తృత చర్చలు..

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న ఈ మహానాడు వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాయచోటి టౌన్ మాసాపేటలోని సాయి శుభ కళ్యాణ మండపంలో నిర్వహించిన 7వ క్లస్టర్ మహానాడు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ, “కార్యకర్తే పార్టీకి అసలైన బలం” అని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి కార్యకర్తల కృషే ప్రధాన ఆధారం అని అన్నారు.

మహానాడు సమావేశంలో “కార్యకర్తే అధినేత”, “స్త్రీశక్తి”, “యువగళం”, అలాగే పేదల సేవలో తెలుగుదేశం పార్టీ పాత్ర వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. మహిళలు, యువత రాజకీయాల్లో మరింత చురుకుగా పాల్గొని పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని మంత్రి పిలుపునిచ్చారు.

మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు.

ఈ మహానాడు కార్యక్రమంలో పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, మహిళా నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని పార్టీ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…