LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Telugu Cultural Centre AP: తెలుగు వైభవానికి అమరావతి వేదిక.. ఎన్టీఆర్ విగ్రహం, మ్యూజియం, ఆడిటోరియం.. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్!

Telugu Cultural Centre AP: అమరావతిలోని నీరుకొండలో 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం, 119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారబోతున్న ఈ ప్రాజెక్ట్ విశేషాలు..

AndhraPravasi News Desk 2 min read
Telugu Cultural Centre AP: తెలుగు వైభవానికి అమరావతి వేదిక.. ఎన్టీఆర్ విగ్రహం, మ్యూజియం, ఆడిటోరియం.. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్!

Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తెలుగు జాతి గర్వించదగ్గ రీతిలో ఒక భారీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరుగుతోంది. తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్మృత్యర్థం నీరుకొండ కొండపై 600 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగానే రూ. 119 కోట్లతో 'తెలుగు కల్చరల్ సెంటర్' నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల ఆమోద ముద్ర వేసింది. ఇది కేవలం ఒక విగ్రహం మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా విరాజిల్లబోతోంది.

నీరుకొండ భౌగోళికంగా అమరావతికి దక్షిణాన ఎత్తైన ప్రదేశంలో ఉండటం ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణ. ఇక్కడ నిర్మించబోయే 600 అడుగుల విగ్రహం ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాల సరసన నిలవనుంది. 'తారకరామం' అనే పేరుతో పిలవబడే ఈ స్మృతి వనంలో ఎన్టీఆర్ సినీ ప్రస్థానం, రాజకీయ ప్రయాణం  ఆయన సాధించిన విజయాలను కళ్లకు కట్టేలా మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. అమరావతి విజన్ మొత్తం ఈ కొండ పైనుంచి కనిపించేలా డిజైన్ చేయడం విశేషం.

సాంస్కృతిక కేంద్రం విషయానికొస్తే, ఇందులో ఒక భారీ ఆడిటోరియం, చారిత్రక పరిశోధనలకు ఉపయోగపడే లైబ్రరీ  తెలుగు వారసత్వ సంపదను ప్రదర్శించే మ్యూజియం ఉంటాయి. తెలుగు భాష, సంస్కృతులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుంది. విగ్రహ నిర్మాణంతో పాటు పారలల్ గా  ఈ కల్చరల్ సెంటర్ పనులను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రత్యేక ప్యాకేజీల కింద టెండర్లను పిలవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఈ ప్రాంతాన్ని 'బ్లూ అండ్ గ్రీన్ బెల్ట్'గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. నీరుకొండ చుట్టూ అందమైన సరస్సు, పచ్చని పార్కులు, అంతర్జాతీయ స్థాయి రిసార్టులు  కన్వెన్షన్ సెంటర్లను నిర్మించనున్నారు. పర్యాటకులు ఇక్కడ బస చేసేందుకు వీలుగా రెస్టారెంట్లు, స్టేయింగ్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల అమరావతికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగడమే కాకుండా, స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎగ్జిక్యూషన్ పార్ట్ వేగవంతం అయింది. ఇప్పటికే డిజైన్లు సిద్ధంగా ఉన్నందున, నెల రోజుల్లోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. విగ్రహ నిర్మాణానికి కనీసం ఏడాది సమయం పడుతుందని అంచనా వేస్తున్నందున, పనులన్నీ ఒకేసారి జరిగేలా విభాగాలుగా విభజించి బాధ్యతలు అప్పగించారు. రాబోయే రోజుల్లో అమరావతికి ఈ నీరుకొండ ప్రాజెక్ట్ ఒక తలమానికంగా నిలవనుంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…