Nominated Posts: తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ.. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం!

Nominated Posts: తెలంగాణ రాష్ట్రంలో పలు కార్పొరేషన్లు, సంక్షేమ సంస్థలకు నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Nominated Posts: తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ.. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం!

తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ..

వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నియామకాలు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలు కార్పొరేషన్లు, సంక్షేమ సంస్థలకు నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్‌గా బస్వరాజు శ్రీనివాస్‌ను నియమించారు. వాషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్‌గా డాక్టర్ అజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. గీత కార్మిక కార్పొరేషన్‌కు చంద్రశేఖర్ గౌడ్‌ను, పెరిక కార్పొరేషన్‌కు గొంగరి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.

అలాగే, మేర కార్పొరేషన్ చైర్మన్‌గా సంగ వెంకట్ రాజం, వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్‌గా గట్టు తిమ్మప్ప బాధ్యతలు స్వీకరించనున్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, యాదవ కార్పొరేషన్ చైర్మన్‌గా రఘునాథ్ యాదవ్ నియమితులయ్యారు.

వడ్డెర కార్పొరేషన్ చైర్మన్‌గా గుంజా రేణుక, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్‌గా దూడెం వెంకట రమణ నియామకం జరిగింది. కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా బండి రమేష్, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్‌గా గూడూరి శ్రీనివాస్, వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగ్ రావును ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇక లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్‌గా చరణ్ కౌశిక్ యాదవ్ నియమితులయ్యారు.

ఈ నియామకాలతో వివిధ వర్గాల సంక్షేమం మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సంబంధిత కార్పొరేషన్ల ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఈ నాయకులు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Be the first to react

Latest