Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.!
Nara Lokesh: ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు బెంగళూరులో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఆయన బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోగా, బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
- "బెంగళూరులో లోకేశ్ సందడి": ఐటీ మంత్రికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు..
- Politics: గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా నారా లోకేశ్: బెంగళూరు పర్యటనలో బిజీబిజీ..
Bangalore Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం సాయంత్రం ఆయన బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా, బెంగళూరు టీడీపీ ఫోరం ప్రతినిధులు, పార్టీ శ్రేణులు మరియు అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. బెంగళూరులోని సర్జాపూర్ ప్రాంతంలో ఉన్న గ్రీన్వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించనున్న ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు మంత్రి ఈ పర్యటన చేపట్టారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు విద్యా రంగంలో వస్తున్న మార్పులపై ఆయన ఈ వేడుకల్లో కీలక సందేశం ఇవ్వనున్నారు.
ఈ పర్యటనకు ముందు మంత్రి లోకేశ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అత్యంత బిజీ షెడ్యూల్ను గడిపారు. ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేబినెట్ భేటీ అనంతరం, రాష్ట్రానికి అత్యంత కీలకమైన రామాయపట్నం పోర్టు అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించేందుకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కూడా ఆయన పాలుపంచుకున్నారు. పోర్టు నిర్మాణ పనులు, అనుసంధాన రహదారుల గురించి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
అమరావతిలో అధికారిక కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుండి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయల్దేరారు. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి పనుల్లో చురుగ్గా పాల్గొంటూనే, మరోవైపు విద్యా రంగ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు లోకేశ్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా బెంగళూరులో స్థిరపడిన పలువురు ఐటీ రంగ నిపుణులు మరియు పారిశ్రామికవేత్తలతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Be the first to react