LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Minister Savitha: సేంద్రీయ వ్యవసాయమే ఆరోగ్యకర భవిష్యత్తుకు మార్గం.. మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు!

Minister Savitha: సేంద్రీయ వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు.

AndhraPravasi News Desk 2 min read
Minister Savitha: సేంద్రీయ వ్యవసాయమే ఆరోగ్యకర భవిష్యత్తుకు మార్గం.. మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు!

ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా మారుతోంది: మంత్రి సవిత..

సేంద్రీయ సాగుతో రైతులకు అధిక లాభాలు: మంత్రి సవిత..

తాడేపల్లి: సేంద్రీయ వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. ప్రస్తుతం సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు కూడా అధిక ఆదాయం లభిస్తోందని పేర్కొన్నారు.

శనివారం తాడేపల్లిలోని ఎఎస్సార్ సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి సవిత అక్కడ సాగుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా మారుతోందని, రసాయన ఎరువులు, పురుగుల మందులు లేకుండా సాగు చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.

రసాయన ఎరువుల వినియోగం వల్ల దిగుబడులు పెరిగినా, దీర్ఘకాలంలో క్యాన్సర్‌తో పాటు పలు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందుకే ప్రజలు సేంద్రీయ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఆరోగ్యకరమైన జీవనానికి ప్రతి ఒక్కరూ సేంద్రీయ ఆహార పదార్థాలను వినియోగించాలని సూచించారు.

సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులను, ఎఎస్సార్ వ్యవసాయ క్షేత్ర నిర్వాహకులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. రైతులు ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి లాభాలు పొందుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.

పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా మంత్రి సవిత తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎఎస్సార్ సేంద్రీయ వ్యవసాయ క్షేత్రానికి సైకిల్‌పై వెళ్లారు. 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ క్షేత్రంలో పర్యటించి వివిధ పంటలను పరిశీలించారు.

సేంద్రీయ ఎరువుల తయారీ విధానాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన సేంద్రీయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని సందర్శించి వివిధ ఉత్పత్తుల ధరలను తెలుసుకున్నారు. కొన్ని ఉత్పత్తులను స్వయంగా కొనుగోలు చేశారు. క్షేత్రంలో పండించిన జామపండును రుచి చూసి రైతుల కృషిని అభినందించారు.

తిరుగు ప్రయాణంలో కూడా సైకిల్‌నే ఉపయోగించిన మంత్రి, మార్గమధ్యంలో పాతూరు రోడ్డులో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద ఆగి మజ్జిగ తాగారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి, ఎఎస్సార్ సేంద్రీయ వ్యవసాయ క్షేత్రం నిర్వాహకుడు సామిరెడ్డి, కూటమి నాయకులు రాజశేఖర్, కొమ్మారెడ్డి కిరణ్, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, సేంద్రీయ ఉత్పత్తుల వినియోగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి సవిత ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…