LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Praja Darbar: ప్రజల సమస్యలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక దృష్టి.. రాయచోటి నివాసంలో ప్రజా దర్బార్!

Praja Darbar: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామంలోని బో రెడ్డి గారి పల్లిలో ఉన్న తన సొంత నివాసంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

AndhraPravasi News Desk 1 min read
Praja Darbar: ప్రజల సమస్యలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక దృష్టి.. రాయచోటి నివాసంలో ప్రజా దర్బార్!

ప్రజల వినతులు స్వయంగా విన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి..

తాగునీరు, రోడ్లు, పెన్షన్ సమస్యలపై ప్రజల వినతులు..

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామంలోని బో రెడ్డి గారి పల్లిలో ఉన్న తన సొంత నివాసంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ప్రజలు తాగునీటి సమస్యలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, పెన్షన్లు, రెవెన్యూ, హౌసింగ్, విద్యుత్ సమస్యలతో పాటు వ్యక్తిగత ఇబ్బందులపై వినతిపత్రాలు అందజేశారు. ప్రతి ఒక్కరి సమస్యను మంత్రి ఓర్పుతో విని సంబంధిత శాఖ అధికారులతో వెంటనే మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు త్వరగా న్యాయం జరిగేలా బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం ప్రజాప్రతినిధుల బాధ్యత అని తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…