LIVE
Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  •  Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!  •  AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. 85% సబ్సిడీతో ఆ పథకం పునరుద్ధరణ!  •  TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో మహిళల త్రోబాల్ టోర్నమెంట్ ఘన విజయం!  •  Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్న భక్తులు!  •  Praja Vedika: నేడు (17/6) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!  •  AP Farmers: రైతులకు డబుల్ ధమాకా.... ఒకే రోజు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు విడుదల!  • 
⚡ BREAKING
Politics

Amaravathi: రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన.. కొండవీటి వాగు, పాలవాగు పరిశీలన!

Amaravathi: రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు.

AndhraPravasi News Desk 1 min read
Amaravathi: రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన.. కొండవీటి వాగు, పాలవాగు పరిశీలన!

కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాల పరిశీలన..

వాగుల ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు..

అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలతో పాటు పెనుమాక రిజర్వాయర్‌ను సందర్శించి పరిస్థితులను అధికారులతో కలిసి సమీక్షించారు.

వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వాగుల సహజ ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న రహదారుల నిర్మాణ పనుల కారణంగా నీటి ప్రవాహం ఎక్కడా అడ్డంకులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

నిర్మాణంలో ఉన్న వంతెనల వద్ద పరిస్థితులను పరిశీలించిన మంత్రి, వంతెనల క్రింది భాగంలో పేరుకుపోయిన మట్టి, పూడికను తొలగించే పనులను వేగవంతం చేయాలని చెప్పారు. వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

రాజధాని నిర్మాణ పనులతో పాటు వరద నివారణ చర్యలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, భవిష్యత్తులో నీటి నిల్వలు లేదా వరద సమస్యలు తలెత్తకుండా సమగ్ర ప్రణాళికతో పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.

రాజధాని అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో మౌలిక వసతుల నిర్మాణంతో పాటు పర్యావరణ, జలవనరుల పరిరక్షణకు కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మంత్రి తెలిపారు.

Be the first to react

More Coverage

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ! ముఖ్య అతిథిగా..

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ! ముఖ్య అతిథిగా..

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…