LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Gummadi Sandhyarani: మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులకు మంత్రి సంధ్యారాణి దిశానిర్దేశం!

Gummadi Sandhyarani: సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కార్యాలయం ఆదివారం పార్టీ కార్యకర్తల సందడితో కళకళలాడింది. నియోజకవర్గంలోని నాయకులు, మండల అధ్యక్షులు, యువ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించి రాబోయే మహానాడు కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

AndhraPravasi News Desk 1 min read
Gummadi Sandhyarani: మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులకు మంత్రి సంధ్యారాణి దిశానిర్దేశం!

ప్రతి మండలంలో ఘనంగా మహానాడు నిర్వహించాలి..

సాలూరులో మహానాడు ఏర్పాట్లపై కీలక సమావేశం నిర్వహించిన మంత్రి..

సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కార్యాలయం ఆదివారం పార్టీ కార్యకర్తల సందడితో కళకళలాడింది. నియోజకవర్గంలోని నాయకులు, మండల అధ్యక్షులు, యువ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించి రాబోయే మహానాడు కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారం, గ్రామ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లే విధానాలపై కార్యకర్తలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆదేశాల మేరకు ఈ నెల 27, 28 తేదీలలో మంగళగిరిలోని సెంట్రల్ పార్టీ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రతి మండలంలో మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండలాల వారీగా సమావేశాలు, ర్యాలీలు, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

గ్రామ స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలు చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు. మహానాడు విజయవంతం కావాలంటే నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలతో పాటు కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి స్వయంగా విన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. “కార్యకర్తలే పార్టీకి అసలైన బలం” అని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు.

సమావేశంలో నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహానాడును విజయవంతం చేయాలనే ఉత్సాహం కార్యకర్తల్లో స్పష్టంగా కనిపించింది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…