LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Kollu Ravindra: నాడు అరాచకాలు చేసి.. నేడు నీతులు చెప్పడం హాస్యాస్పదం! వైసీపీ పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు!

Kollu Ravindra: వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రరవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శించారు. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడా…

AndhraPravasi News Desk 2 min read
Kollu Ravindra: నాడు అరాచకాలు చేసి.. నేడు నీతులు చెప్పడం హాస్యాస్పదం! వైసీపీ పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు!

నాడు పీకలు కోసి.. నేడు నీతులు మాట్లాడటమా..

రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కట్టేశామని ప్రగల్భాలు..

అమరావతి: వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రరవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శించారు. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పునాది వేసింది మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. తరువాత ఉమ్మడి రాష్ట్రంలో అనేక మెడికల్ కాలేజీలు, వైద్య సంస్థలను అభివృద్ధి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు దేనని పేర్కొన్నారు. తిరుపతిలో బర్డ్, టాటా క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ వంటి సంస్థలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారని తెలిపారు.

అలాగే రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు చేసి పేదలకు నాణ్యమైన వైద్యం అందించేలా చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశంసించిన మంత్రి, గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆ సంస్థకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎయిమ్స్‌కు కృష్ణా నది నుంచి పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరా ప్రారంభించిందన్నారు.

మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నామని, దీని ద్వారా రెండు సంవత్సరాల్లో 2500 కొత్త ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. పీపీపీ ఆసుపత్రుల్లో 70 శాతం పడకలను ఎన్టీఆర్ వైద్య సేవ, ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు కేటాయిస్తామని వెల్లడించారు.

విద్యారంగంపై మాట్లాడుతూ, 2014-19 మధ్య రాష్ట్రం విద్యా ప్రమాణాల్లో మూడో స్థానంలో ఉండగా, వైసీపీ పాలనలో 19వ స్థానానికి పడిపోయిందని ఆరోపించారు. గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు.

పదో తరగతి ఉత్తీర్ణత శాతం వైసీపీ హయాంలో 62 శాతానికి పడిపోయిందని, ఇప్పుడు అది 85 శాతానికి పెరిగిందని మంత్రి చెప్పారు. మెగా పేరెంట్-టీచర్ సమావేశాల ద్వారా గిన్నిస్ రికార్డు సాధించామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ల విలీనంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యారని ఆరోపించారు. ఆస్తుల తాకట్టు అంశంపై కూడా మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి భూములు, విశాఖలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి వేల కోట్ల అప్పులు తెచ్చుకున్నారని ఆరోపించారు. గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టుల అంశాలను కూడా ప్రస్తావించారు.

వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని, ప్రశ్నించిన వారిపై కేసులు, దాడులు జరిగాయని మంత్రి పేర్కొన్నారు. మద్యం, ఇసుక, రాజధాని అంశాలపై నిరసన తెలిపిన వారిని అణచివేశారని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నదన్నారు. చివరగా, “ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన మంచి ఒక్కటి అయినా చెప్పగలరా?” అంటూ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని, ఇప్పుడు వైసీపీ నేతలు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా మారిందని వ్యాఖ్యానించారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…