Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటు... మంత్రి కందుల దుర్గేష్!
Nadendla Bhaskara Rao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) నేడు హైదరాబాద్లో మరణించారు. ఆయన మృతి పట్ల ఏపీ మంత్రి కందుల దుర్గేష్ సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. నాదెండ్ల భాస్కరరావు గారి కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఏపీ…
Politics- మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత…
నాదెండ్ల మనోహర్ కుటుంబానికి కందుల దుర్గేష్ పరామర్శ…
నాదెండ్ల మృతి పట్ల ఏపీ కేబినెట్ సంతాపం…
Nadendla Bhaskara Rao: గత కొంతకాలంగా వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నాదెండ్ల భాస్కరరావు గారు హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న మంత్రి కందుల దుర్గేష్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాదెండ్ల కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ప్రస్తుత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మంత్రి కందుల దుర్గేష్ గారు నాదెండ్ల భాస్కరరావు గారి రాజకీయ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాదెండ్ల గారు ఒక చెరగని ముద్ర వేశారని, ఆయన అనుభవం మరియు పరిపాలనా దక్షత చిరస్మరణీయమని కొనియాడారు. ముఖ్యమంత్రిగా, మంత్రిగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. నాదెండ్ల భాస్కరరావు గారి అంత్యక్రియలు రేపు (గురువారం) సాయంత్రం 4 గంటలకు పంజాగుట్టలోని శ్మశానవాటికలో జరగనున్నాయి.
Be the first to react