LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

MLC Chiranjeevi: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే హక్కు సభ్యులకు ఉంది.. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి!

MLC Chiranjeevi: శాసన మండలి సభ్యుల రాజీనామాలను చైర్మన్ తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి తీవ్రంగా విమర్శించారు.

AndhraPravasi News Desk 2 min read
MLC Chiranjeevi: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే హక్కు సభ్యులకు ఉంది.. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి!

జయమంగళ వెంకటరమణ రాజీనామాను తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికం..

ఎవరి ప్రయోజనాల కోసం సభ్యుల రాజీనామాలను తిరస్కరిస్తున్నారో చైర్మన్ చెప్పాలి..

అమరావతి: శాసన మండలి సభ్యుల రాజీనామాలను చైర్మన్ తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికై పదవిలోకి వచ్చిన ప్రతి ప్రజాప్రతినిధికి స్వచ్ఛందంగా రాజీనామా చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ రాజీనామాను చైర్మన్ తిరస్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

జయమంగళం వెంకటరమణతో పాటు కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, చక్రవర్తి, పోతుల సునీత, జాకియా ఖానం తదితరులు వైసీపీకి రాజీనామా చేస్తూ ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేసినట్లు తెలిపారు. 2024 నవంబర్‌లో రాజీనామాలు సమర్పించినప్పటికీ దాదాపు ఏడాది గడిచినా వాటిపై నిర్ణయం తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. సభ్యులు లిఖితపూర్వకంగా మాత్రమే కాకుండా సభలో కూడా తమ రాజీనామాలను ఆమోదించాలని కోరినా చైర్మన్ స్పందించలేదని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించగా, చైర్మన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించినప్పటికీ స్పందించలేదని చెప్పారు. దీంతో 2025 సెప్టెంబర్‌లో కోర్టు రూ.10,000 జరిమానా విధించి, 30 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందని తెలిపారు. ఒక చైర్మన్‌పై కోర్టు జరిమానా విధించడం చాలా అరుదైన విషయం అని అన్నారు.

ఏపీ శాసనమండలి రూల్ నెం.190 ప్రకారం సభ్యుడు ఎవరి ద్వారా అయినా రాజీనామా లేఖను పంపవచ్చని, చైర్మన్ సభ్యుడిని పిలిచి అది స్వచ్ఛందమా కాదా తెలుసుకోవచ్చని వివరించారు. సభ్యులు స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని స్పష్టం చేసినప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. అసలు ఈ ఆలస్యం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో చైర్మన్ వెల్లడించాలని డిమాండ్ చేశారు.

చైర్మన్ తీరు ప్రజాస్వామ్య సంస్థలపై నమ్మకాన్ని దెబ్బతీస్తోందని వేపాడ చిరంజీవి విమర్శించారు. స్పీకర్‌గా పనిచేసిన సోమనాథ్ ఛటర్జీను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా తటస్థంగా వ్యవహరించాల్సిన బాధ్యత చైర్మన్‌దని చెప్పారు.

ఒక సభ్యుడు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే దాన్ని ఆమోదించడం సహజ ప్రక్రియ అని, దాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమేనని అన్నారు. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. చైర్మన్ రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.

మహాభారతంలోని కర్ణుడి ఉదాహరణను ప్రస్తావిస్తూ, మంచి స్థానంలో ఉన్న వ్యక్తి తీసుకునే నిర్ణయాలే అతని వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయని అన్నారు. శాసన మండలి గౌరవాన్ని కాపాడుతూ, ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా చైర్మన్ వ్యవహరించాలని వేపాడ చిరంజీవి కోరారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…