LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

LPG News: వంట గ్యాస్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం? సామాన్యుడికి రూ. 100 వరకు ఊరట!

LPG Subsidy News: గ్యాస్ ధరల భారంతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించే అవకాశం ఉంది. ఎల్‌పీజీ, పీఎన్‌జీలపై జీఎస్‌టీ పన్నులను తొలగించాలనే ప్రతిపాదన అమలైతే, గృహ వినియోగ సిలిండర్‌పై రూ. 100 వరకు, వాణిజ్య సిలిండర్‌పై రూ. 317 వరకు ధర తగ్గే ఛాన్స్...

AndhraPravasi News Desk 2 min read
LPG  News: వంట గ్యాస్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం? సామాన్యుడికి రూ. 100 వరకు ఊరట!

LPG Subsidy News: ప్రస్తుత కాలంలో సామాన్యుడి బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తున్న అంశాల్లో వంట గ్యాస్ ధరలు ప్రధానమైనవి. అయితే, పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించే అవకాశం కనిపిస్తోంది. గృహ అవసరాలకు వాడే ఎల్‌పిజి (LPG), అలాగే పైపుల ద్వారా సరఫరా అయ్యే పిఎన్జీ (PNG)పై ఉన్న పన్నులను తగ్గించాలని లేదా పూర్తిగా తొలగించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

పన్నుల భారం తగ్గితేనే ఊరట

ప్రస్తుతం వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్లపై ఏకంగా 18 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. దీన్ని గనుక తొలగిస్తే, వ్యాపారస్తులకు ఒక్కో సిలిండర్‌పై సుమారు రూ. 317 వరకు మేలు జరుగుతుంది. దీని ప్రభావం హోటల్ ధరలు, ఇతర ఆహార పదార్థాల ధరలపై కూడా పడే అవకాశం ఉంది. మరోవైపు, ఇళ్లలో వాడుకునే గృహ వినియోగ సిలిండర్లపై ప్రస్తుతం 5 శాతం జీఎస్‌టీ ఉంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ పన్నును రద్దు చేస్తే, సిలిండర్ ధరలో సుమారు రూ. 43 తగ్గుతుంది. దీనికి తోడు, ఇటీవల పెరిగిన అదనపు ధరలను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంటే, సామాన్యుడికి మొత్తం మీద రూ. 100 వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం

ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీనివల్ల ప్రపంచ మార్కెట్‌లో ధరలు పెరిగి, ఆ భారం చివరకు దేశీయ వినియోగదారులపై పడుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్రమే చొరవ తీసుకుని పన్ను మినహాయింపులు ఇస్తే తప్ప, సామాన్యుడికి ఉపశమనం లభించదు. అందుకే, 'చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ' (CTI) వంటి సంస్థలు ప్రధాని మోదీకి ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి.

 రాష్టాల పన్నుల గోల

పీఎన్‌జీ (PNG) గ్యాస్ విషయానికి వస్తే, ఇది ఇంకా జీఎస్‌టీ పరిధిలోకి రాలేదు. దీనివల్ల వివిధ రాష్ట్రాలు తమ ఇష్టానుసారం వ్యాట్ (VAT) విధిస్తున్నాయి. ఈ పన్నుల వల్ల గ్యాస్ ధరలు భారీగా మారుతున్నాయి. దీన్ని కూడా ఒకే పన్ను పరిధిలోకి తీసుకురావాలని లేదా పన్నులు తగ్గించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే, పెరుగుతున్న నిత్యావసర ధరల మధ్య ఇది మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటగా మారుతుంది. అయితే, తుది నిర్ణయం ఎప్పుడు వస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…