LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

LPG Crisis India: గ్యాస్ కష్టాలకు చెక్.. కమర్షియల్ సిలిండర్ల సరఫరా పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం.!!

LPG Crisis India: పశ్చిమాసియా సంక్షోభం వేళ కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, పరిశ్రమలకు కమర్షియల్ ఎల్పీజీ కోటాను 20 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

AndhraPravasi News Desk 1 min read
LPG Crisis India: గ్యాస్ కష్టాలకు చెక్.. కమర్షియల్ సిలిండర్ల సరఫరా పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం.!!

LPG Crisis India: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన ఇంధన గండం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు  చిన్న తరహా పరిశ్రమలకు ఊరటనిస్తూ కమర్షియల్ ఎల్పీజీ (LPG) కోటాను భారీగా పెంచింది. గత మూడు వారాలుగా గ్యాస్ సిలిండర్ల కొరతతో అల్లాడుతున్న వ్యాపార రంగానికి ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది.

పరిస్థితిని సమీక్షించిన కేంద్ర పెట్రోలియం శాఖ, రాష్ట్రాలకు అందే కమర్షియల్ గ్యాస్ కోటాను అదనంగా 20 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల హోటళ్లు, క్యాంటీన్లు  ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు మునుపటిలాగే గ్యాస్ సరఫరా అందనుంది. ప్రస్తుత సరఫరా సంక్షోభానికి ముందున్న స్థాయిలో 50 శాతానికి చేరుకుందని అధికారులు వెల్లడించారు.

అయితే, ఈ అదనపు గ్యాస్ కోటా పొందాలనుకునే వ్యాపార సంస్థలకు ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. పెంచిన కోటాను కావాలనుకునే వారు తప్పనిసరిగా ఆయిల్ కంపెనీల దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. అంతేకాకుండా, భవిష్యత్తులో ఎల్పీజీపై భారం తగ్గించడానికి వీలుగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. దీర్ఘకాలంలో సిలిండర్ల వాడకాన్ని తగ్గించి, నేరుగా పైపుల ద్వారా గ్యాస్ సరఫరాను ప్రోత్సహించడమే దీని ప్రధాన ఉద్దేశం.

సామాన్యులకు భయం వద్దు.. గృహ వినియోగదారులకు ఎక్కడా ఇబ్బంది కలగదు. ప్రస్తుతం దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి పెరగడం వల్ల సామాన్యుల సిలిండర్ల సరఫరా పక్కాగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొరత వస్తుందనే భయంతో ముందే బుక్ చేసుకునే 'పానిక్ బుకింగ్స్' చేయవద్దని, హోమ్ డెలివరీ సర్వీసులు ఎప్పటిలాగే సక్రమంగా జరుగుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

మరోవైపు గ్యాస్ బ్లాక్ మార్కెట్‌పై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 3,500 చోట్ల దాడులు నిర్వహించి, అక్రమంగా నిల్వ ఉంచిన 1,400 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారతీయ నౌకలు, నావికులు సురక్షితంగా ఉన్నారని తెలియజేయడంతో ఇంధన రంగం మళ్లీ గాడిలో పడుతోంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…