LIVE
Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  •  Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!  •  AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. 85% సబ్సిడీతో ఆ పథకం పునరుద్ధరణ!  •  TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో మహిళల త్రోబాల్ టోర్నమెంట్ ఘన విజయం!  •  Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్న భక్తులు!  •  Praja Vedika: నేడు (17/6) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!  •  AP Farmers: రైతులకు డబుల్ ధమాకా.... ఒకే రోజు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు విడుదల!  • 
⚡ BREAKING
Politics

Palnadu: పల్నాడులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై మరో భూ కబ్జా ఆరోపణ.. న్యాయం కోసం బాధిత కుటుంబం విజ్ఞప్తి!

Palnadu: పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించిన భూ కబ్జా ఆరోపణలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా వినుకొండలో మరో భూమి ఆక్రమణ వ్యవహారం బయటపడింది.

AndhraPravasi News Desk 1 min read
Palnadu: పల్నాడులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై మరో భూ కబ్జా ఆరోపణ.. న్యాయం కోసం బాధిత కుటుంబం విజ్ఞప్తి!

40 సెంట్ల భూమి కబ్జా చేశారంటూ మాజీ ఎమ్మెల్యే బొల్లాపై ముస్లిం కుటుంబం ఆరోపణలు..

బయటపడుతున్న బొల్లా భూ వివాదాలు.. న్యాయం కోరుతున్న బాధితులు..

పల్నాడు: పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించిన భూ కబ్జా ఆరోపణలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా వినుకొండలో మరో భూమి ఆక్రమణ వ్యవహారం బయటపడింది.

వినుకొండకు చెందిన ఓ ముస్లిం కుటుంబం తమ 40 సెంట్ల భూమిని వైసీపీ ప్రభుత్వ హయాంలో బొల్లా బ్రహ్మనాయుడు అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించింది. ఆ సమయంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న అధికారాన్ని ఉపయోగించి తమను బెదిరింపులకు గురి చేశారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.

భూమి విషయంలో అప్పట్లో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. అధికార ఒత్తిళ్ల కారణంగా తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని, దీంతో ఎన్నో సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం మళ్లీ వెలుగులోకి రావడంతో బాధిత కుటుంబం మీడియా ముందుకు వచ్చి తమ గోడును వినిపించింది. తమ భూమిని తిరిగి ఇప్పించి, న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో ఉన్న నేపథ్యంలో ఈ కొత్త ఆరోపణలు రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ భూ వివాదంపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని స్థానికులు కూడా కోరుతున్నారు. బాధిత కుటుంబం చేసిన ఆరోపణలపై అధికారుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Be the first to react

More Coverage

Madanapalle: మదనపల్లిలో అటహాసంగా సాగిన రెండేళ్ల కూటమి ప్రభుత్వం పాలన విజయోత్సవ సభ.. ముఖ్య అతిథిగా.. రాటకొండ మధుబాబు కీలక వ్యాఖ్యలు!

Madanapalle: మదనపల్లిలో అటహాసంగా సాగిన రెండేళ్ల కూటమి ప్రభుత్వం పాలన విజయోత్సవ సభ.. ముఖ్య అతిథిగా.. రాటకొండ మధుబాబు కీలక వ్యాఖ్యలు!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ స్థాయి కూటమి ప…