LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Palnadu: పల్నాడులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై మరో భూ కబ్జా ఆరోపణ.. న్యాయం కోసం బాధిత కుటుంబం విజ్ఞప్తి!

Palnadu: పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించిన భూ కబ్జా ఆరోపణలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా వినుకొండలో మరో భూమి ఆక్రమణ వ్యవహారం బయటపడింది.

AndhraPravasi News Desk 1 min read
Palnadu: పల్నాడులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై మరో భూ కబ్జా ఆరోపణ.. న్యాయం కోసం బాధిత కుటుంబం విజ్ఞప్తి!

40 సెంట్ల భూమి కబ్జా చేశారంటూ మాజీ ఎమ్మెల్యే బొల్లాపై ముస్లిం కుటుంబం ఆరోపణలు..

బయటపడుతున్న బొల్లా భూ వివాదాలు.. న్యాయం కోరుతున్న బాధితులు..

పల్నాడు: పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించిన భూ కబ్జా ఆరోపణలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా వినుకొండలో మరో భూమి ఆక్రమణ వ్యవహారం బయటపడింది.

వినుకొండకు చెందిన ఓ ముస్లిం కుటుంబం తమ 40 సెంట్ల భూమిని వైసీపీ ప్రభుత్వ హయాంలో బొల్లా బ్రహ్మనాయుడు అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించింది. ఆ సమయంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న అధికారాన్ని ఉపయోగించి తమను బెదిరింపులకు గురి చేశారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.

భూమి విషయంలో అప్పట్లో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. అధికార ఒత్తిళ్ల కారణంగా తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని, దీంతో ఎన్నో సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం మళ్లీ వెలుగులోకి రావడంతో బాధిత కుటుంబం మీడియా ముందుకు వచ్చి తమ గోడును వినిపించింది. తమ భూమిని తిరిగి ఇప్పించి, న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో ఉన్న నేపథ్యంలో ఈ కొత్త ఆరోపణలు రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ భూ వివాదంపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని స్థానికులు కూడా కోరుతున్నారు. బాధిత కుటుంబం చేసిన ఆరోపణలపై అధికారుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…