LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై..

Jagan: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఇప్పటికీ మిస్టరీనే. ఐతే, ఈ విషాద ఘటనను గత 15 ఏళ్లుగా వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. వైఎస్ మరణం వెనుక కుట్ర ఉందంటూ నాటి కాంగ్రెస్ హైకమాండ్‌పై, ఆ తర్వాత టీడీపీపై ఆర…

AndhraPravasi News Desk 2 min read
Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై..
  • ఆస్తి తగాదాలు.. ఆత్మీయుల దూరం: వైఎస్ కుటుంబ వివాదాలతో బలపడుతున్న పాత అనుమానాలు..
     
  • Politics: నాడు కాంగ్రెస్‌పై.. నేడు సొంత రక్తానికే సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిలో జగన్?

Jagan: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఇప్పటికీ మిస్టరీనే. ఐతే, ఈ విషాద ఘటనను గత 15 ఏళ్లుగా వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. వైఎస్ మరణం వెనుక కుట్ర ఉందంటూ నాటి కాంగ్రెస్ హైకమాండ్‌పై, ఆ తర్వాత టీడీపీపై ఆరోపణలు చేశారు. కానీ, ఇప్పుడు ఆనాడు వైసీపీ వ్యక్తం చేసిన అనుమానాల బాణం..ఇప్పుడు తిరిగి జగన్ మోహన్ రెడ్డి వైపు మళ్లుతుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

వైఎస్ మరణించిన సమయంలో కాంగ్రెస్‌లో సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సహా మరికొంతమంది గతంలోనే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ మరణం వల్ల అత్యధికంగా లబ్ధి పొందింది ఎవరనే కోణంలో విచారణ జరపాలంటూ నాటి కాంగ్రెస్ నేతలు పరోక్షంగా జగన్‌ను టార్గెట్ చేశారు. తాజాగా రాజకీయ సమీకరణాలు మారిన వేళ, ఆ పాత ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాలు, సొంత పార్టీ ఏర్పాటు, అధికారంలోకి రావడం.. ఇవన్నీ చూస్తుంటే నాటి విమర్శల్లోని అంతరార్థం ఇప్పుడు జనాల్లో చర్చకు దారితీస్తోంది. 

వైఎస్ కుటుంబంలో నెలకొన్న ఆస్తి తగాదాలు, రాజకీయ విభేదాలు ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. వైఎస్ షర్మిల, విజయమ్మ జగన్‌కు దూరం కావడం.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత తమ్ముడిపైనే ఆరోపణలు రావడం చూస్తే.. వైఎస్ మరణం విషయంలోనూ నాడు వినిపించిన 'ఇన్‌సైడర్' కుట్ర కోణం నిజమేనా..? అన్న అనుమానాలు వస్తున్నాయి. రాజకీయం కోసం తండ్రి మరణాన్ని వాడుకున్నారా..? లేక నిజంగానే దాని వెనుక ఎవరికీ తెలియని రహస్యాలు ఉన్నాయా..? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

జగన్ తన ప్రసంగాల్లో తరచుగా దేవుడి స్క్రిప్ట్ అనే పదం వాడుతుంటారు. ప్రత్యర్థులకు చెడు జరిగితే అది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని జగన్ చెప్పేవారు. అయితే, ఇప్పుడు అదే దేవుడి స్క్రిప్ట్ రివర్స్ అయి జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నాడు తండ్రి మరణంపై ఇతరులను వేలెత్తి చూపిన జగన్, ఇప్పుడు అదే అంశంపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురవ్వడం నిజంగా దేవుడి స్క్రిప్టే.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…