LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

LPG: రోజుకు 50 వేల టన్నులకు పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి! కేంద్రం కీలక ప్రకటన!

LPG: దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

AndhraPravasi News Desk 2 min read
LPG: రోజుకు 50 వేల టన్నులకు పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి! కేంద్రం కీలక ప్రకటన!

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల మధ్య ఇంధన భద్రతపై కేంద్రం ఫోకస్..

నాలుగు రోజుల్లో 1.72 కోట్ల ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ..

దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పశ్చిమ ఆసియా పరిణామాల నేపథ్యంలో న్యూఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖల సమావేశంలో అధికారులు దేశంలో ఇంధన, ఎరువుల నిల్వల పరిస్థితిపై వివరాలు వెల్లడించారు.

పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ దేశంలో ఎల్పీజీ రిఫైనరీ ఉత్పత్తిని రోజుకు 50 వేల టన్నులకు పెంచినట్లు తెలిపారు. మార్చి నెల నుంచి ఇప్పటివరకు 8 లక్షలకు పైగా పీఎన్‌జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభించామని, మరో 2 లక్షల 87 వేల కనెక్షన్లకు అవసరమైన మౌలిక వసతులు సిద్ధం చేసినట్లు చెప్పారు.

గత నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా సుమారు 1 కోటి 72 లక్షల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ చేసినట్లు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం 95 శాతానికి పైగా సిలిండర్ డెలివరీలు ఓటీపీ విధానంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల ప్రారంభం నుంచి 1 లక్ష 56 వేల టన్నుల కమర్షియల్ ఎల్పీజీ అమ్ముడైందని, గత నాలుగు రోజుల్లోనే 24 వేల టన్నులకు పైగా విక్రయాలు నమోదైనట్లు చెప్పారు. అదేవిధంగా చిన్న వినియోగదారుల కోసం ఉన్న 5 కిలోల సిలిండర్లలో లక్షా 96 వేలకుపైగా విక్రయించినట్లు పేర్కొన్నారు.

ప్రజలు అవసరానికి మించి గ్యాస్ కొనుగోళ్లు చేసి ఆందోళన సృష్టించవద్దని, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను కూడా వినియోగించాలని సుజాత శర్మ సూచించారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై భారత రాయబార కార్యాలయాలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ నావికులకు అవసరమైన సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన సందర్భంగా కుదిరిన కీలక ఒప్పందాలు దేశ ఇంధన భద్రతకు బలాన్ని చేకూర్చాయని పేర్కొన్నారు.

ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ దేశంలో ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. సంవత్సరానికి అవసరమయ్యే 390 లక్షల మెట్రిక్ టన్నుల అంచనాకు గాను ప్రస్తుతం 200 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ఇది సాధారణ స్థాయి కంటే ఎంతో మెరుగైన పరిస్థితి అని పేర్కొన్నారు.

దేశీయంగా ఇప్పటివరకు 95 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి కాగా, దిగుమతుల రూపంలో మరో 22 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. దీంతో మొత్తం ఎరువుల లభ్యత 117 లక్షల మెట్రిక్ టన్నులను దాటిందని చెప్పారు. ఖరీఫ్ సీజన్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే 13 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 9 లక్షల మెట్రిక్ టన్నుల ఎన్‌పీకే ఎరువులను ముందుగానే సమకూర్చుకున్నామని వెల్లడించారు.

ముడి పదార్థాలు, తయారైన ఎరువుల నిల్వలను కేంద్ర ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోందని, ప్రస్తుతం దేశంలో పరిస్థితి పూర్తిగా స్థిరంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…