LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

MLA Somireddy: మూడు నెలల్లో హార్బర్ పూర్తి.. ఆ జిల్లా మత్స్యకారులకు తీపి కబురు చెప్పిన సోమిరెడ్డి..

MLA Somireddy: నెల్లూరు జిల్లాలోని మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి ఎక్కడ అన్యాయం జరిగినా అండగా నిలిచే మొదటి వ్యక్తిని తానేనని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

AndhraPravasi News Desk 2 min read
MLA Somireddy: మూడు నెలల్లో హార్బర్ పూర్తి.. ఆ జిల్లా మత్స్యకారులకు తీపి కబురు చెప్పిన సోమిరెడ్డి..
  • Politics: "అన్యాయం జరిగితే ముందుండేది నేనే": మత్స్యకార వర్గాలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ..
     
  • వెంకయ్య నాయుడి కృషితోనే హార్బర్ మంజూరు: జువ్వలదిన్నె ప్రాజెక్టు వెనుక చరిత్రను వివరించిన సోమిరెడ్డి..

Nellore MLA Somireddy: నెల్లూరు జిల్లాలోని మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి ఎక్కడ అన్యాయం జరిగినా అండగా నిలిచే మొదటి వ్యక్తిని తానేనని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మత్స్యకారులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని, ఈ విషయంలో వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు. రాబోయే మూడు నెలల్లోనే జువ్వలదిన్నె హార్బర్ పనులన్నింటినీ పూర్తి చేసి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనితో పాటు పెండింగ్‌లో ఉన్న నేలటూరు జెట్టీ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయించే బాధ్యతను తాను తీసుకుంటున్నానని భరోసా ఇచ్చారు.

రాష్ట్ర తీరప్రాంతానికి, మత్స్యకార వర్గాలకు వైఎస్సార్ కుటుంబమే తీరని ద్రోహం చేసిందని సోమిరెడ్డి ఈ సందర్భంగా మండిపడ్డారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జగన్ ఆర్థిక ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన జీవో 40 వల్ల మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతిందని ఆరోపించారు. కృష్ణపట్నం పోర్టు మరియు వాడరేవు మధ్య ఎటువంటి హార్బర్లు నిర్మించకూడదని ఆ జీవోలో పేర్కొనడం వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శించారు. అయితే, మత్స్యకారులకు శాపంగా మారిన ఆ వివాదాస్పద జీవోను గతంలోనే చంద్రబాబు నాయుడు రద్దు చేశారని, అప్పుడే ఈ ప్రాంతాభివృద్ధికి మార్గం సుగమమైందని ఆయన గుర్తు చేశారు.

జువ్వలదిన్నె హార్బర్ ఏర్పాటు వెనుక మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృషి ఎంతో ఉందని, ఆయన చొరవతోనే ఈ ప్రాజెక్టు మంజూరైందని సోమిరెడ్డి తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2019 మార్చి 7వ తేదీన ఈ ఫిషింగ్ హార్బర్ కోసం రూ. 288 కోట్లను మంజూరు చేశామని ఆయన వివరించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని, ఆ నిర్లక్ష్యం వల్లే పనులు పూర్తి కాలేదని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించి, నిర్ణీత గడువులోగా మత్స్యకారుల కలలను సాకారం చేస్తామని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. 

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…