LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Nazir Ahmed: వైసీపీపై ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీకి ఇవే రుజువులు” అంటూ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మండిపాటు!

Nazir Ahmed: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

AndhraPravasi News Desk 2 min read
Nazir Ahmed: వైసీపీపై ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీకి ఇవే రుజువులు” అంటూ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మండిపాటు!

మాజీ మంత్రి విడుదల రజిని గారు నీతులు మాట్లాడటం హాస్యాస్పదం..

వైసీపీది గొడ్డలి సంస్కృతి అనడంలో ఎటువంటి సందేహం లేదు..

మంగళగిరి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి విడదల రజిని వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ, “వైసీపీది గొడ్డలి సంస్కృతి” అని వ్యాఖ్యానించారు.

గత ఐదేళ్లలో రాష్ట్రంలో అరాచక పాలన, రౌడీయిజం పెరిగిందని, అందుకే ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీను కేవలం 11 సీట్లకు పరిమితం చేసి తగిన బుద్ధి చెప్పారు అన్నారు. ఎన్నికల ముందు “ఒక్క అవకాశం” అంటూ ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆశలను నెరవేర్చలేదని విమర్శించారు.

అన్నా క్యాంటీన్లను మూసివేయడం పేదవాడి పొట్టపై గొడ్డలితో నరకడమేనని ఆయన ఆరోపించారు. అలాగే పెన్షన్ హామీల విషయంలో కూడా ప్రజలను మోసం చేశారని, రూ.3000 ఇస్తామని చెప్పి క్రమంగా పెంచుతూ కాలయాపన చేశారని అన్నారు. మైనారిటీ విద్యార్థులకు అందాల్సిన పథకాలను నిలిపివేసి, వారి భవిష్యత్తును దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అనేక హత్యలు, దాడులు జరిగాయని నసీర్ అహ్మద్ ఆరోపించారు. వివిధ సంఘటనలను ప్రస్తావిస్తూ, రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కడం కోసం హింసాత్మక మార్గాలను అనుసరించారని అన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీని “గొడ్డలి పార్టీ” అని పిలవడం సరైనదేనని వ్యాఖ్యానించారు.

అలాగే, సొంత కుటుంబ సభ్యులపై కూడా వివాదాలు తెచ్చుకున్న నాయకత్వం ఇది అని, “కిల్లింగ్ మైండ్ సెట్”తో వ్యవహరించారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను మాత్రమే కాకుండా, తమ పార్టీలో ఉన్న వారినే వేధించిన సందర్భాలు ఉన్నాయని అన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం, పేదల సమస్యలను పట్టించుకోకపోవడం, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయడం— ఇవన్నీ కలిసి ప్రజల్లో అసంతృప్తిని పెంచాయని, అందుకే ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పారు.

ఇప్పటికైనా మాజీ మంత్రి విడదల రజిని వంటి నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచిస్తూ, “మీరు చేసింది పాలన కాదు… అరాచకం” అని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ స్పష్టం చేశారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…