LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Government Schools: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో పిల్లలకు ఉచితంగా సైకిల్లు పంపిణీ.. దాతల సహకారంతో!

Government Schools: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ధీటుగా చదివితేనే మంచి భవిష్యత్తు సాధ్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.

AndhraPravasi News Desk 2 min read
Government Schools: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో పిల్లలకు ఉచితంగా సైకిల్లు పంపిణీ.. దాతల సహకారంతో!

ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు ధీటుగా చ‌దివితేనే విద్యార్థులకు మంచి భ‌విష్య‌త్తు..

దాత‌ల స‌హ‌కారంతోనే విద్యార్థుల‌కు ఉచితంగా సైకిల్లు..

అద్దంకి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ధీటుగా చదివితేనే మంచి భవిష్యత్తు సాధ్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలంలో శుక్రవారం ఆయన పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముక్తేశ్వరం, చెన్నుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన సుమారు 96 మంది విద్యార్థులకు మంత్రి ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. దాతల సహకారంతో ఈ సైకిళ్లు అందించామని తెలిపారు. ఇప్పటివరకు అద్దంకి నియోజకవర్గంలోనే దాదాపు 11,200కు పైగా సైకిళ్లు విద్యార్థులకు అందించామని వెల్లడించారు.

విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు, షూస్ అందిస్తున్నామని తెలిపారు. “తల్లికి వందనం” పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.15,000 చొప్పున అందిస్తున్నామని చెప్పారు.

గతంలో ఒక్కో పాఠశాలకు ఒక్క టీచర్ మాత్రమే ఉండేవారని, దాంతో విద్యార్థులు ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో డీఎస్సీ ద్వారా 16,400 టీచర్ పోస్టులు భర్తీ చేయడంతో నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.

మధ్యాహ్న భోజనం నాణ్యంగా అందేలా చూసే బాధ్యత అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు. గ్రామ పెద్దలు కూడా అప్పుడప్పుడు పాఠశాలల్లో భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలని సూచించారు. రైతు భరోసా, ఉపాధి హామీ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా అనే విషయాల్లో సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇదే సందర్భంగా బల్లికురవలోని శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజలు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు, ప్రభుత్వం నుంచి రూ.1 కోటి సీఎజీఎఫ్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

తదుపరి ఎస్సీ కాలనీలో 30 ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల సోలార్ కనెక్షన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే 6 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.1.25 లక్షల విలువైన 2 కిలోవాట్ సోలార్ యూనిట్లను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. 3 కిలోవాట్ సోలార్ కనెక్షన్ తీసుకునే బీసీలకు రూ.98 వేల సబ్సిడీ, ఓసీలకు రూ.78 వేల సబ్సిడీ ఇస్తామని వివరించారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా రూ.8 వేల కోట్లతో ఆర్డీఎస్ఎస్ పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఈ పనులు పూర్తయితే గ్రామాల్లో కూడా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, రైతులకు పగటి పూటే 9 గంటల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…