LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Atchennaidu: డ్వాక్రాతో గ్రామీణ అభివృద్ధికి డిజిటల్ దిశలో కీలక అడుగు.. VOAలకు 5జీ ఫోన్ల పంపిణీ!

Atchennaidu: మహిళలు సొంత కాళ్లపై నిలబడాలనే లక్ష్యంతో డ్వాక్రా సంఘాలు స్థాపించబడ్డాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

AndhraPravasi News Desk 1 min read
Atchennaidu: డ్వాక్రాతో గ్రామీణ అభివృద్ధికి డిజిటల్ దిశలో కీలక అడుగు.. VOAలకు 5జీ ఫోన్ల పంపిణీ!

ప్రభుత్వ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి..

ఆడబిడ్డలు సొంత కాళ్లపై నిలబడాలనే లక్ష్యంతో డ్వాక్రా స్థాపన..

నిమ్మాడ: మహిళలు సొంత కాళ్లపై నిలబడాలనే లక్ష్యంతో డ్వాక్రా సంఘాలు స్థాపించబడ్డాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆయన అన్నారు.

జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన 180 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (VOA)లకు మంత్రి 5జీ మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని VOAలకు సూచించారు. డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వం మీపై ఉంచిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని అన్నారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రతి ఒక్కరూ జాబ్ చార్ట్ ప్రకారం పని చేయాలని స్పష్టం చేశారు.

డ్వాక్రా సంఘాలు మహిళల ఆర్థిక పురోగతికి కీలకమని, ఈ వ్యవస్థపై తనకు ప్రత్యేక గౌరవం ఉందని మంత్రి పేర్కొన్నారు. మహిళలు పొదుపు సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదగడం గర్వకారణమని చెప్పారు.

అదే సమయంలో 5జీ ఫోన్ల ద్వారా VOAలు స్వయం సహాయక సంఘాల డేటా, పొదుపులు, రుణాల వివరాలు, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని వేగంగా నిర్వహించగలరని వివరించారు. గ్రామీణ అభివృద్ధిలో డిజిటల్ దిశగా ఇది ఒక కీలక అడుగుగా నిలుస్తుందని తెలిపారు.

డ్వాక్రా ద్వారా మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేసినట్లు పేర్కొన్న మంత్రి, గ్రామ సంఘాలను మరింత బలోపేతం చేసి మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పి. భానుమతి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…