LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Krishna District: కృష్ణా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.. పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణపై దృష్టి!

Krishna District: కృష్ణా జిల్లా పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు సందడిగా జరిగాయి. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హోం మంత్రి వంగలపూడి అనిత తో కలిసి కంకిపాడు, ఆత్కూరులో నూతన పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించారు.

AndhraPravasi News Desk 2 min read
Krishna District: కృష్ణా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.. పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణపై దృష్టి!

కృష్ణా జిల్లా పెనమలూరు, గన్నవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర..

హోం మంత్రి అనితతో కలిసి కంకిపాడు,ఆత్కూరు పోలీస్ స్టేషన్ నూతన భవనాల ప్రారంభం..

కృష్ణా జిల్లా పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు సందడిగా జరిగాయి. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హోం మంత్రి వంగలపూడి అనిత తో కలిసి కంకిపాడు, ఆత్కూరులో నూతన పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించారు. అనంతరం ఆత్కూరు గ్రామంలో రూ.1.20 కోట్ల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజలకు ఉత్తమ పోలీసింగ్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

ఆత్కూరు పోలీస్ స్టేషన్ నిర్మాణానికి రూ.60 లక్షల సొంత నిధులు కేటాయించిన హరికృష్ణకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ భవనం ప్రజలకు మరింత ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో మహిళలపై నేరాల నివారణలో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమని, ఈ విషయంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ సేవలను మంత్రి ప్రశంసించారు. శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతికత వినియోగం కీలకమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఏఐ వినియోగాన్ని పెంచాలని సూచించారని గుర్తు చేశారు.

పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్న కెమెరాలను ఏఐ వ్యవస్థతో అనుసంధానం చేస్తే నేరస్తులను వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. తిరుమలలో ఇప్పటికే ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ అమలుతో భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రిస్తున్నారని ఉదాహరణగా చెప్పారు.

ప్రజల భద్రత కోసం ప్రభుత్వం పోలీస్ శాఖను మరింత బలోపేతం చేస్తోందని, ఇటీవలే సుమారు 6 వేల మంది పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

అనంతరం గన్నవరం నియోజకవర్గం ఆత్కూరులో రూ.1.20 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా గుంతలులేని రోడ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్నారు.

ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గ్రామాల రూపురేఖలు మారుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, జనసేన జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…