LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Elections: ఐదు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. పలుచోట్ల హోరాహోరీ పోరు!

Elections: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఐదు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కౌంటింగ్ కొనసాగుతోంది.

AndhraPravasi News Desk 1 min read
Elections: ఐదు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. పలుచోట్ల హోరాహోరీ పోరు!

ఆధిక్యంలో కొనసాగుతున్న కీలక నేతలు..

ఐదు అసెంబ్లీల మ్యాజిర్​ ఫిగర్ స్థానాలు..

దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఐదు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కౌంటింగ్ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి, అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపును చేపట్టారు. ప్రశాంతంగా కౌంటింగ్ సాగేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

తమిళనాడులోని కొళత్తూర్‌ తో పాటు 59 స్థానాల్లో ఎం.కె. స్టాలిన్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, పెరంబూరుతో పాటు 80 స్థానాల్లో  విజయ్ ఆధిక్యంలో ఉన్నారు. ఎడప్పాడిలో ఎడప్పాడి కె. పళనిస్వామి ముందంజలో ఉన్నారు. అలాగే చేపాక్కం-తిరువల్లికేణి నియోజకవర్గంలో ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందంజలో ఉన్నారు.

మొదటి పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ ప్రకారం ఎన్‌డీఏ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 7 స్థానాల్లో ముందంజలో ఉంది. తమిళనాడులో డీఎంకే ఆరంభం నుంచే ఆధిక్యాన్ని సాధించింది. ఇక బంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఫలితాలు మారుతూ ఉండటంతో ఉత్కంఠ నెలకొంది.

కేరళలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇరు కూటములు చెరో 50 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తూ గెలుపు కోసం పోటీపడుతున్నాయి.

ఒకవైపు కౌంటింగ్ ఉత్కంఠ కొనసాగుతుండగా, మరోవైపు దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాల కోసం జిలేబీలు తయారు చేస్తున్నారు. ఫలితాలు అనుకూలంగా వస్తాయని భావిస్తూ పార్టీ నేతలు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఐదు అసెంబ్లీల్లో గెలుపు సాధించడానికి కావాల్సిన స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి:
తమిళనాడు (234 స్థానాలు) – మ్యాజిక్ ఫిగర్ 118
పుదుచ్చేరి (30 స్థానాలు) – మ్యాజిక్ ఫిగర్ 16
అస్సాం (126 స్థానాలు) – మ్యాజిక్ ఫిగర్ 64
పశ్చిమ బెంగాల్ (294 స్థానాలు) – మ్యాజిక్ ఫిగర్ 148
కేరళ (140 స్థానాలు) – మ్యాజిక్ ఫిగర్ 71

మొత్తంగా చూస్తే ఐదు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. కీలక నేతల ఆధిక్యం, కూటముల మధ్య గట్టి పోటీతో దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి మరింత పెరిగింది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…