LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Amaravathi: అమరావతి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు! జిల్లాల్లో అభివృద్ధి, పాలనా వ్యవహారాలపై చర్చ!

Amaravathi: అమరావతిలో రాష్ట్ర పరిపాలనకు కీలకంగా నిలిచే కలెక్టర్ల సదస్సు రేపు, ఎల్లుండి సచివాలయంలో జరగనుంది. జిల్లాల అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో మెరుగుదల సాధించేందుకు ఈ సదస్సు వేదికగా మారనుంది.

AndhraPravasi News Desk 1 min read
Amaravathi: అమరావతి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు! జిల్లాల్లో అభివృద్ధి, పాలనా వ్యవహారాలపై చర్చ!

పాలన, అభివృద్ధిలో ఉత్తమ పనితీరు చూపిన, జిల్లాలకు ర్యాంకులు ప్రకటించనున్న ఏపీ రెవెన్యూ శాఖ..

ఈ-ఆఫీస్ విధానానికి ప్రాధాన్యమిస్తోన్న ఏపీ ప్రభుత్వం..

అమరావతిలో రాష్ట్ర పరిపాలనకు కీలకంగా నిలిచే కలెక్టర్ల సదస్సు రేపు, ఎల్లుండి సచివాలయంలో జరగనుంది. జిల్లాల అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో మెరుగుదల సాధించేందుకు ఈ సదస్సు వేదికగా మారనుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పనితీరును సమీక్షిస్తూ, ఉత్తమ ఫలితాలు సాధించిన జిల్లాలకు ర్యాంకులు ప్రకటించేందుకు ఏపీ రెవెన్యూ శాఖ సిద్ధమైంది.

ఏ జిల్లాలు ఎలాంటి కారణాలతో ఉత్తమ ర్యాంకులు సాధించాయో, వారు అనుసరించిన విధానాలు ఏమిటో సీఎస్ ప్రత్యేక ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. ముఖ్యంగా ఈ-ఆఫీస్ విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వ దృష్టి, ఫైళ్ల పరిష్కారం వేగవంతం చేయడం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత పెంచడం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.

ప్రజల సంతృప్తి స్థాయి ఎలా ఉంది? ఫిర్యాదుల పరిష్కారం ఎంత వేగంగా జరుగుతోంది? వంటి కీలక అంశాలు కూడా సదస్సులో ప్రాధాన్యం పొందనున్నాయి. తొలిరోజు సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం “స్వర్ణాంధ్ర-2047” లక్ష్యాలపై ప్రత్యేక చర్చ జరగనుంది.

ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం సాధించిన ఫలితాలు, జిల్లాల వారీగా అభివృద్ధి పురోగతి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల ప్రభావం వంటి అంశాలపై కూడా సమగ్ర సమీక్ష జరుగుతుంది. ఈ సదస్సు ద్వారా జిల్లాల మధ్య పోటీ వాతావరణం పెరగడంతో పాటు, పరిపాలనలో మరింత పారదర్శకత, వేగం తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…