LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Telangana: మిషన్ మోడ్‌లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.. నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవన్న సీఎం రేవంత్ రెడ్డి!

Telangana: తెలంగాణలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.

AndhraPravasi News Desk 2 min read
Telangana: మిషన్ మోడ్‌లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.. నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవన్న సీఎం రేవంత్ రెడ్డి!

కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు..

రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూడాలి..

తెలంగాణలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, కొనుగోళ్ల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.

మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. ధాన్యం సేకరణ పురోగతి, మొక్కజొన్న కొనుగోళ్ల పరిస్థితిపై సమీక్ష చేశారు. జిల్లాల్లో ఎదురవుతున్న సమస్యలను కలెక్టర్లను అడిగి తెలుసుకుని, వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యం రవాణాకు అవసరమైన లారీలు అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయడానికీ వెనుకాడొద్దని అధికారులను ఆదేశించారు.

కొన్ని ప్రాంతాల్లో గోదాముల కొరత ఉన్నట్లు గుర్తించామని, అలాంటి చోట్ల తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు. రైతు బజార్లు, ఫంక్షన్ హాల్స్ వంటి ప్రదేశాలను వినియోగించి ధాన్యాన్ని భద్రపరచాలని చెప్పారు. అక్కడి నుంచి దశలవారీగా గోదాములకు తరలించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

మొక్కజొన్న పంట ఎక్కువగా పండే జిల్లాల్లో కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం కలెక్టర్లకు సూచించారు. అవసరమైతే పోలీసుల సహకారంతో కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని చెప్పారు. ప్రతి జిల్లా కలెక్టర్ ధాన్యం సేకరణపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదికలు పంపాలని ఆదేశించారు.

అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను రైతులకు వెంటనే చేరవేసేలా మండల స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. రైతులను అప్రమత్తం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పారు.

ప్రతి ఐకేపీ కేంద్రం వద్ద ఒక అధికారిని నియమించి సమస్యలు తలెత్తకుండా చూడాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రతి రైస్ మిల్లు వద్ద కూడా బాధ్యతాయుతమైన అధికారిని ఉంచి పర్యవేక్షణ చేయాలని సూచించారు. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు అందించాలని, అలా చేస్తే తాలు, తరుగు పేరుతో జరిగే అక్రమాలను అరికట్టవచ్చని చెప్పారు.

లారీల కొరత ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. కలెక్టర్లు నేరుగా పర్యవేక్షిస్తేనే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని, ఏ సమస్య వచ్చినా బాధ్యత తీసుకుని పరిష్కరించాలని స్పష్టం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు మరియు జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.

ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ధాన్యం సేకరణలో కలెక్టర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఎక్కడ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. సరిహద్దు రాష్ట్రాల రైతులు కూడా తెలంగాణ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. అలాంటి పరిస్థితులను నియంత్రించేందుకు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…