LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: మహిళా రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు.. విపక్షాలపై తీవ్ర విమర్శలు!

Chandrababu: మహిళా రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలకు రిజర్వేషన్లు వస్తాయని దేశవ్యాప్తంగా ఆశలు నెలకొన్న సమయంలో కాంగ్రెస్ సహా మిత్రపక్షాలు మహిళా బిల్లును అడ్డుకోవడం ద్రోహమని ఆయన విమర్శించారు.

AndhraPravasi News Desk 2 min read
Chandrababu: మహిళా రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు.. విపక్షాలపై తీవ్ర విమర్శలు!

కాంగ్రెస్, మిత్రపక్షాలు మహిళా బిల్లును అడ్డుకున్నాయి..

మహిళలకు ద్రోహం చేయడం.. జాతి విద్రోహం..

మహిళా రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలకు రిజర్వేషన్లు వస్తాయని దేశవ్యాప్తంగా ఆశలు నెలకొన్న సమయంలో కాంగ్రెస్ సహా మిత్రపక్షాలు మహిళా బిల్లును అడ్డుకోవడం ద్రోహమని ఆయన విమర్శించారు.

మహిళలకు ద్రోహం చేయడం అంటే జాతికి ద్రోహం చేసినట్టేనని చంద్రబాబు స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతిలో మహిళలను గౌరవించి, అన్ని రంగాల్లో ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యమని, కానీ విపక్షాలు ఈ విలువలకు విరుద్ధంగా వ్యవహరించాయని అన్నారు.

మహిళా రిజర్వేషన్ల కోసం మూడు దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతోందని గుర్తుచేసిన సీఎం, సాధించే సమయానికి అడ్డుకోవడం క్షమించరాని తప్పిదమని అన్నారు. “ఇది ప్రారంభం మాత్రమే… మహిళా లోకం మొత్తం ఏకమైంది” అంటూ మహిళలు ఆత్మగౌరవంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను సీఎం ఖండించారు. దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలు లేదా చిన్న రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని తెలిపారు. 2017లోనే అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.

2029 నాటికి మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని ఆయన చెప్పారు. అయితే మహిళలు ఎదగడం కొందరికి నచ్చడం లేదని, ఆడబిడ్డలను ఇంటి వరకే పరిమితం చేయాలనే దురుద్దేశంతో విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఓడించడం దుర్మార్గమని వ్యాఖ్యానించిన సీఎం, ఈ అంశాన్ని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. విపక్ష పార్టీలు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాయో ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.

“నిన్న విద్రోహ దినం… విపక్షాల ద్రోహాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి” అంటూ ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మహిళా సాధికారత కోసం అడ్డంకులు సృష్టించకుండా సహకరించడం విపక్షాల బాధ్యత అని అన్నారు. చివరిగా, మహిళలకు నిజమైన న్యాయం జరగాలంటే విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…