TN Elections: తమిళనాడులో ఎన్డీఏ తరఫున సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం!
Tamil Nadu Elections: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) తరఫున ఆయన పలు కీలక ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.
తమిళనాడులో ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న సీఎం చంద్రబాబు..
రేపు మధ్యాహ్నం అమరావతి నుంచి కోయంబత్తూరు వెళ్లనున్న సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) తరఫున ఆయన పలు కీలక ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.
రేపు మధ్యాహ్నం అమరావతి నుంచి కొయంబత్తూరుకు బయలుదేరనున్న సీఎం, అక్కడి నుంచి తన ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కోయంబత్తూరు, హోసూర్, చెన్నై, ఆవడి వంటి ప్రాంతాల్లో ఆయన సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు.
హోసూరు సమీపంలోని తాలి ప్రాంతంలో జరిగే భారీ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ సభలో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను ఆకర్షించేలా ఆయన సందేశం ఇవ్వనున్నారు. అనంతరం ఆవడిలో రోడ్ షో నిర్వహించి ప్రజలను నేరుగా కలుస్తారు.
అలాగే మదురై – సత్తూర్ ప్రాంతాల్లో కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ పర్యటనలో అభివృద్ధి, సంక్షేమం, కేంద్ర-రాష్ట్ర సమన్వయం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఎన్డీఏకు మద్దతు కోరనున్నారు.
తమిళనాడులో జరుగుతున్న ఈ ప్రచారం ద్వారా ఎన్డీఏ బలం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం చంద్రబాబు పర్యటనతో అక్కడి రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Be the first to react