LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ!

Chandrababu: లాటరైట్ ఖనిజ వర్గీకరణలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో గనుల లీజుల ప్రక్రియ తీవ్రంగా ప్రభావితమవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

AndhraPravasi News Desk 2 min read
Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ!

కొత్త గనుల నిబంధనలతో ఏపీలో 402 లీజు దరఖాస్తులు నిలిచిపోయినట్లు సీఎం వెల్లడి..

లాటరైట్‌ను బాక్సైట్‌గా వర్గీకరించడంపై ఏపీ ఆందోళన..

లాటరైట్ ఖనిజ వర్గీకరణలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో గనుల లీజుల ప్రక్రియ తీవ్రంగా ప్రభావితమవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాశారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం లాటరైట్‌లో అల్యూమినియం శాతం 20 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే, దాన్ని ఉప ఖనిజం (మైనర్ మినరల్)గా కాకుండా బాక్సైట్‌గా పరిగణించాలనే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఇప్పటికే ప్రాసెస్‌లో ఉన్న అనేక గనుల లీజు దరఖాస్తులు నిలిచిపోయాయని సీఎం తన లేఖలో వివరించారు.

కొత్త నిబంధనల కారణంగా గతంలో మైనర్ మినరల్ కింద పరిశీలించిన మొత్తం 402 గనుల లీజు దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వీటిలో 19 లెటర్ ఆఫ్ ఇంటెంట్ దరఖాస్తులు, 113 ప్రభుత్వ భూములకు సంబంధించినవి, 255 అటవీ భూముల దరఖాస్తులు, 15 పట్టా భూముల దరఖాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.

పాత నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు అప్లికేషన్ ఫీజులు చెల్లించడమే కాకుండా, భూముల కొనుగోలు, అటవీ అనుమతుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సీఎం తెలిపారు. ఇప్పుడు అకస్మాత్తుగా నిబంధనలు మారడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు.

గతంలో మైకా, క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, బారైట్స్ వంటి ఖనిజాలను మైనర్ నుంచి మేజర్ ఖనిజాలుగా మార్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం “సేవింగ్ క్లాజ్” ఇచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. అదే విధంగా ఇప్పుడు లాటరైట్ విషయంలో కూడా సేవింగ్ క్లాజ్ అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న 402 దరఖాస్తులను పాత నిబంధనల ప్రకారమే పూర్తి చేసుకునేందుకు రెండు సంవత్సరాల గడువు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

ఇలా సడలింపు ఇస్తే వందలాది మంది దరఖాస్తుదారులు ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారని, అనవసర కోర్టు వివాదాలు కూడా తలెత్తవని సీఎం లేఖలో వివరించారు. అదేవిధంగా సిమెంట్, ఐరన్ ఓర్, రోడ్డు నిర్మాణ రంగాలకు అవసరమైన ముడిసరుకు సరఫరా కొనసాగి, ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతినకుండా ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల దృష్ట్యా కేంద్రం సానుకూలంగా స్పందించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…