LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Krishna District: కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన! పేదల సేవలో కీలక కార్యక్రమాలు!

Krishna District: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లాలో విస్తృత పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో పేదల సంక్షేమం, కార్మికులతో మమేకం, ఆరోగ్య సేవల విస్తరణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

AndhraPravasi News Desk 1 min read
Krishna District: కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన! పేదల సేవలో కీలక కార్యక్రమాలు!

కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన..

‘మేడే’ సందర్భంగా కార్మికులతో ముఖ్యమంత్రి ముఖాముఖి..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లాలో విస్తృత పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో పేదల సంక్షేమం, కార్మికులతో మమేకం, ఆరోగ్య సేవల విస్తరణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా సీఎం పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలకు వెళ్లి ప్రజలతో ప్రత్యక్షంగా కలవనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్దిదారులను పరామర్శించి, వారి ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేయనున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు రూ.63,158 కోట్లను పింఛన్ల రూపంలో పేదలకు అందించినట్లు అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలోనే ప్రతీ నెల 2.34 లక్షల మందికి సుమారు రూ.102 కోట్లను ప్రభుత్వం పింఛన్లుగా ఇస్తోంది.

మేడే సందర్భంగా కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి, భవన నిర్మాణ కార్మికులతో ప్రత్యేకంగా ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు. వారి సమస్యలు, అవసరాలు తెలుసుకుని తక్షణ చర్యలపై చర్చించనున్నారు.

అదేవిధంగా గుడ్లవల్లేరు వద్ద నిర్మించిన ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిను సీఎం ప్రారంభించనున్నారు. ఈ ఆసుపత్రి ప్రారంభంతో స్థానిక ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

పర్యటన షెడ్యూల్:
ఉదయం సీఎం తన నివాసం నుంచి బయలుదేరి 10.15 గంటలకు వీరంకిలాకు గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.25 గంటలకు పమిడిముక్కలకు చేరుకుని ప్రజావేదికలో సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం ఎన్టీఆర్ కాలనీలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తారు.
మధ్యాహ్నం 12.45 గంటలకు మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో సమావేశం జరపనున్నారు. 01.55 గంటలకు పామర్రు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తారు.
తరువాత 03.40 గంటలకు గుడ్లవల్లేరు చేరుకుని, 03.50 గంటలకు కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 04.45 గంటలకు సీఎం తిరిగి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.

ఈ పర్యటన ద్వారా ప్రజలతో నేరుగా కలసి వారి సమస్యలు తెలుసుకోవడం, సంక్షేమ పథకాల అమలు పరిస్థితిని సమీక్షించడం, అలాగే ఆరోగ్య రంగానికి మరింత బలం చేకూర్చడం లక్ష్యంగా సీఎం ముందుకు సాగుతున్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…