LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: పెట్రోల్, డీజిల్ సరఫరాపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్!

Chandrababu: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

AndhraPravasi News Desk 1 min read
Chandrababu: పెట్రోల్, డీజిల్ సరఫరాపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్!

పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు లోడ్ డిస్పాచెస్ ఎలా జరుగుతున్నాయని సీఎం ఆరా..

టెలికాన్ఫరెన్సులో పాల్గొన్న వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు..

విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు లోడ్ డిస్పాచెస్ ఎలా జరుగుతున్నాయో సీఎం స్వయంగా ఆరా తీశారు. దీనిపై అధికారులు స్పందిస్తూ… రాత్రంతా లోడ్లు పంపిణీ జరిగాయని, నిరంతరం బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరుగుతోందని తెలిపారు.

ఇవాళ ఉదయం 6 గంటల నాటికి మొత్తం 1402 లోడ్లు డిస్పాచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు వివరించారు. అలాగే గత అర్థరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు 2173 కిలోలీటర్ల పెట్రోల్, 2846 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగినట్లు తెలిపారు.

స్టాక్ లేని బంకుల సంఖ్యపై కూడా సీఎం వివరాలు తెలుసుకున్నారు. నిన్నటి పరిస్థితులతో పోలిస్తే స్టాక్ సమస్య గణనీయంగా తగ్గిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఉదయం 6 గంటల నాటికి 432 బంకులు మినహా మిగతా అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేంత వరకు నిరంతరం మానిటరింగ్ కొనసాగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు తగ్గించాలని, అవసరమైతే టోకెన్ లేదా స్లాట్ సిస్టంలను అమలు చేయాలని సూచించారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…