LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష!

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఇంధన కొరతపై ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడడం, వాహనదారులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆయన అధికారులతో విస్తృతంగా చర్చించారు.

AndhraPravasi News Desk 2 min read
Chandrababu: రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష!

పలుచోట్ల పెట్రోల్ బంకుల మూసివేతపై అధికారులతో చర్చించిన సీఎం..

ఇంధన సరఫరాపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్‍తో ఫోను‍లో చర్చలు..

ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఇంధన కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడడం, వాహనదారులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆయన అధికారులతో విస్తృతంగా చర్చించారు.

పలు జిల్లాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకున్న సీఎం, సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సాయిప్రసాద్‌తో పాటు పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అలాగే పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేశారు.

సీఎం ఆదేశాల నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించారు. ఇంధన సరఫరా అంశంపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్‌తో ఫోన్‌లో చర్చలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా స్టాక్ లేని పెట్రోల్ బంకుల వివరాలను తక్షణం అందించాలని ఆదేశించారు. దీనిపై రాష్ట్ర డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులకు సమాచారం పంపింది.

ఇక సమస్యను త్వరగా గుర్తించి పరిష్కరించేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ కీలక సూచనలు చేశారు. స్టాక్ సమస్య ఉన్నవారు వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1967కు కాల్ చేసి వివరాలు నమోదు చేయాలని కోరారు. ఈ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని తక్షణ చర్యలు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఆయిల్ కంపెనీలు కూడా సహకారం అందించేందుకు ముందుకొచ్చాయి. గత ఏప్రిల్‌తో పోలిస్తే 10 శాతం అదనపు ఇంధన సరఫరాకు అంగీకరించాయి. ఇదే సమయంలో పెట్రోల్ డీలర్ల నుంచి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఏపీఎఫ్‌పీటీ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి పేరం రవికుమార్ నిమగ్నమయ్యారు.

క్షేత్రస్థాయిలో ఆయిల్ కంపెనీల సరఫరా పరిస్థితులపై సమగ్ర నివేదిక సిద్ధం చేయడానికి అసోసియేషన్ ప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు. ఈ నివేదికను కమిషనర్‌కు సమర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మొత్తం మీద ప్రభుత్వం వేగంగా స్పందించడంతో, రాష్ట్రంలో ఇంధన కొరత సమస్య త్వరలోనే తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు కూడా ఆందోళన చెందకుండా సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…