LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: నాణ్యతతో ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా మారాలి.. ఏపీలో రేర్ ఎర్త్ మినరల్ పార్క్ ఏర్పాటుకుసీఎం చంద్రబాబు ప్రణాళికలు!

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో తయారయ్యే ఉత్పత్తులు ప్రపంచస్థాయి బ్రాండ్లుగా ఎదగాలంటే నాణ్యతపై ప్రత్యేక దృష్టి అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

AndhraPravasi News Desk 2 min read
Chandrababu: నాణ్యతతో ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా మారాలి.. ఏపీలో రేర్ ఎర్త్ మినరల్ పార్క్ ఏర్పాటుకుసీఎం చంద్రబాబు ప్రణాళికలు!

ప్రతి జిల్లాలో కనీసం ఒక మెగా ఇండస్ట్రియల్ పార్క్..

ప్రతి ఇండస్ట్రియల్ క్లస్టర్ సమీపంలో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తయారయ్యే ఉత్పత్తులు ప్రపంచస్థాయి బ్రాండ్లుగా ఎదగాలంటే నాణ్యతపై ప్రత్యేక దృష్టి అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైలు, పోర్ట్ కనెక్టివిటీని సమర్థంగా కల్పించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న ప్రొడక్ట్ పర్‌ఫెక్షన్ క్లస్టర్ల పురోగతిని సీఎం సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ ‘భారత్ ఆడ్యోగిక వికాస్ యోజన (BHAVYA)’ కింద అభివృద్ధి చేయనున్న ఇండస్ట్రియల్ పార్కులు, కెమికల్ పార్కులపై చర్చ జరిగింది.

2026–27 నాటికి రేర్ ఎర్త్ మినరల్ పార్క్ ఏర్పాటు, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి, కంటైనర్ తయారీ క్లస్టర్ ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 175 ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి వంటి అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.

పారిశ్రామిక పార్కుల్లో లాజిస్టిక్స్‌తో పాటు నీరు, విద్యుత్, కోల్డ్ స్టోరేజ్, గోదాములు వంటి మౌలిక సదుపాయాలు సమగ్రంగా ఉండాలని సీఎం సూచించారు. స్థానిక ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ పడాలంటే నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ యూనిట్లు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.

రైతులకు కూడా పారిశ్రామిక అభివృద్ధి ప్రయోజనాలు చేరాలనే ఉద్దేశంతో క్లస్టర్లలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (FPOs) ఏర్పాటు చేయాలని సూచించారు. భవ్య పథకం కింద అనుకూల ప్రాంతాల్లో కెమికల్ తయారీ పార్కులను అభివృద్ధి చేయాలని చెప్పారు.

పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాలను సమన్వయంతో అభివృద్ధి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి స్థానిక యువతకు భారీ ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రతి ఇండస్ట్రియల్ క్లస్టర్ సమీపంలో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేయాలని సూచించిన సీఎం, “ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త” (One Family One Entrepreneur) ఆలోచనను ప్రోత్సహించాలని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని, విశ్వవిద్యాలయాల్లో హైబ్రిడ్ విధానంలో కోర్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల మంత్రి టీజీ భరత్, ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…