LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ!

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్వహించిన చిట్‌చాట్‌లో వైసీపీ, జగన్ కుటుంబ రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేశారు.

AndhraPravasi News Desk 1 min read
Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ!

ప్రజాస్వామ్యంలో గొడ్డలి రాజకీయాలకు స్థానం లేదు : చంద్రబాబు..

వైఎస్ కుటుంబ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి : చంద్రబాబు..

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్వహించిన చిట్‌చాట్‌లో వైసీపీ, జగన్ కుటుంబ రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు “సైకో” కంటే “గొడ్డలి పార్టీ” అనే అంశాన్ని బలంగా గుర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఈ అంశం మరింతగా చర్చకు వస్తుండటంతో జగన్‌లో అసహనం, ఫ్రస్టేషన్ పెరుగుతోందని అన్నారు.

వైఎస్ కుటుంబానికి సంబంధించిన అనేక అరాచకాలు తనకు కూడా పూర్తిగా తెలియవని, ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం కడప జిల్లాలో ప్రచురితమైన “పాలెగాళ్ల రాజ్యం” అనే పుస్తకాన్ని ఇప్పుడు ప్రజలు మళ్లీ చదువుతున్నారని చెప్పారు. ఆ పుస్తకంలో అప్పట్లోనే కొన్ని వాస్తవాలు బయటపెట్టారని గుర్తుచేశారు.

ప్రజాస్వామ్యంలో హింసాత్మక రాజకీయాలకు స్థానం లేదని సీఎం స్పష్టం చేశారు. “నక్సలైట్లు గన్‌తో రాజ్యాధికారాన్ని సాధించలేరు… అలాగే గొడ్డలితో రాజకీయాలు చేయలేరు” అంటూ వ్యాఖ్యానించారు. అందుకే వైసీపీ ప్రజాస్వామ్యానికి పనికిరాని పార్టీగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు.

వివేకానందరెడ్డి హత్య కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ కేసులో సునీత చేస్తున్న పోరాటంలో న్యాయం, ధర్మం ఉన్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. “తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు సునీతకు ఉంది కదా” అని ప్రశ్నించారు. సునీత పోరాటం వల్లే వివేకా హత్య కేసు ఇప్పటికీ సజీవంగా ఉందని పేర్కొన్నారు.

హత్యా రాజకీయాలు చేసినవారు రాష్ట్రాన్ని పాలించవచ్చా? కానీ బాధితులు జిల్లా రాజకీయాలు కూడా చేయకూడదా? అని సీఎం ప్రశ్నించారు. ఇప్పటి యువతకు కూడా వైఎస్ కుటుంబ హత్యా రాజకీయాల గురించి అర్థమవుతోందని, జగన్ కుటుంబ చరిత్ర ఇప్పుడు ప్రజలకు పూర్తిగా తెలిసిపోయిందని చంద్రబాబు అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…