- బడ్జెట్ సమావేశాల పొడిగింపు తరహాలోనే..: 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ వేదికగా చారిత్రక బిల్లుల సందడి..
- Politics: విపక్షాలకు షాక్ ఇస్తూ కేంద్రం వ్యూహం: అత్యంత రహస్యంగా ప్రత్యేక సమావేశాల షెడ్యూల్ ఖరారు..
Parliament special session: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ ఈ నెల 16వ తేదీ నుండి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 16, 17 మరియు 18 తేదీల్లో వరుసగా జరగనున్న ఈ సమావేశాల కోసం ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ రెండో విడత సమావేశాలను ప్రోరోగ్ (Proregue) చేయకుండా, నేరుగా 16వ తేదీకి వాయిదా వేసింది. దీని ప్రకారం, 16వ తేదీ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అతి తక్కువ సమయంలోనే ఈ ప్రత్యేక సెషన్ను ఏర్పాటు చేయడం వెనుక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కొన్ని కీలక బిల్లుల ఆమోదమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
ఈ మూడు రోజుల ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగిన 'మహిళా రిజర్వేషన్ల అమలు చట్ట సవరణ బిల్లు'ను ప్రవేశపెట్టనుంది. దీనితో పాటు దేశంలోని నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును కూడా చర్చకు తీసుకురానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం మరియు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల కోసం నియోజకవర్గాల పరిధిని సవరించే అంశాలపై ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.