LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

AP TIDCO Houses: లక్షలాది పేదల సొంతింటి కల సాకారం.. ఏపీలో అట్టహాసంగా 2.5 లక్షల గృహప్రవేశాల పండుగ!

AP TIDCO Houses: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సరికొత్త రికార్డు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో నేడు 2.5 లక్షల టిడ్కో గృహప్రవేశాల మహోత్సవం. గత ఐదేళ్ల అడ్డంకులను అధిగమించి పేదవాడి సొంతింటి కలని నిజం చేసిన కూటమి ప్రభుత్వం.

AndhraPravasi News Desk 2 min read
AP TIDCO Houses: లక్షలాది పేదల సొంతింటి కల సాకారం.. ఏపీలో అట్టహాసంగా 2.5 లక్షల గృహప్రవేశాల పండుగ!

AP TIDCO Houses: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈరోజు ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. వేలాది పేద కుటుంబాల దశాబ్దాల కల నిజమవుతున్న వేళ, రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. గత ఐదేళ్లుగా అంధకారంలో ఉన్న టిడ్కో ఇళ్లకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో నేడు తిరుపతి జిల్లా నాయుడుపేట వేదికగా సుమారు 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.

గత ప్రభుత్వం అనుసరించిన మొండి వైఖరి వల్ల రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో గృహ నిర్మాణాలు పూర్తిగా కుంటుపడ్డాయి. కేవలం రాజకీయ కక్షతో, ముందుటి ప్రభుత్వ ముద్ర ఉందనే నెపంతో అప్పటి పాలకులు ఇళ్లను పట్టించుకోకుండా వదిలేశారు. దీనివల్ల వేల కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా కావడమే కాకుండా, అప్పులు చేసి డబ్బులు కట్టిన పేద ప్రజలు నట్టేట మునిగారు. అసంపూర్తిగా వదిలేసిన ఆ భవనాలు పిచ్చిమొక్కలతో, శిథిలావస్థకు చేరుకుని పాములకు నిలయాలుగా మారడం మనం చూశాం. పేదవాడి సొంతింటి కలపై గత పాలకులు నీళ్లు చల్లారు.

             ఇది పేదలకు నాడు జగన్ రెడ్డి ఇచ్చిన సెంటు ఇళ్లు

కానీ, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగిపోయిన బిల్లులను విడుదల చేసి, కాంట్రాక్టర్లను సమన్వయం చేస్తూ అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయించారు. కేవలం ఇళ్లే కాకుండా విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ  రోడ్ల వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఆ కాలనీలకు కొత్త రూపు తీసుకువచ్చారు. పాలకుడు తలచుకుంటే అసాధ్యం సుసాధ్యం అని ఈ ప్రభుత్వం నిరూపించింది.

ఈరోజు జరుగుతున్న గృహప్రవేశాల మహోత్సవంలో కేవలం టిడ్కో ఇళ్లే కాకుండా, ఇతర గృహ నిర్మాణ పథకాల కింద నిర్మించిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలంతో పాటు, బలహీన వర్గాలకు అదనపు ఆర్థిక సాయం అందించడం ద్వారా పేదవాడికి ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ  మైనారిటీ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రస్థానం అభినందనీయం. సొంత ఇల్లు అనేది ఒక ఆత్మగౌరవ ప్రతీక అని భావించే ప్రతి పేదవాడికి ఈరోజు నిజమైన పండుగ రోజు.

      ఇవి నేడు చంద్రబాబు గారు పేదలకు ఇస్తున్న  టిడ్కో ఇళ్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ప్రేమగా 'మేస్త్రీ' అని ఎందుకు పిలుచుకుంటున్నారో ఈ అద్భుతమైన నిర్మాణాలే సాక్ష్యం. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాజకీయాల కంటే ప్రజల అవసరాలే ముఖ్యమని భావించే ఇలాంటి పరిపాలన వల్లనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా లక్షలాది కుటుంబాల కళ్లలో ఆనందం నింపిన కూటమి ప్రభుత్వం, సుపరిపాలనకు కొత్త నిర్వచనం చెప్పింది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…