LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి!

AP Revenue Department: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో గత 22 నెలల్లో వచ్చిన సమూల మార్పులు, రీసర్వే 2.0 లక్ష్యాలు కొత్త పట్టాదారు పాసుపుస్తకాల ప్రత్యేకతలపై ప్రత్యేక కథనం. భూ వివాదాల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు..

AndhraPravasi News Desk 2 min read
AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి!

AP Revenue Department:  ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా అస్తవ్యస్తంగా మారిన రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గత పాలకుల హయాంలో భూ వివాదాలు, రికార్డుల తారుమారుతో ప్రజలు అనుభవించిన మానసిక వేదనకు స్వస్తి పలుకుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రెవెన్యూ శాఖకు కొత్త కొత్త బలం' చేకూరుతుంది. ప్రజల ఆస్తులకు పూర్తి స్థాయి భద్రత కల్పించడమే లక్ష్యంగా, పాత చట్టాలకు మార్పులు చేస్తూ విప్లవాత్మక నిర్ణయాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా వివాదాస్పద 'ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్' రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది.

గత ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే విధానం అనేక తప్పులతో కూడి ఉండటంతో, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం రీ-సర్వే 2.0' కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16,816 గ్రామాల్లో సర్వే ప్రక్రియ వేగంగా సాగుతోంది. 2027 మార్చి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి, ప్రతి రైతుకూ స్పష్టమైన హక్కులను కల్పించాలని ప్రభుత్వం గడువు పెట్టుకుంది. సర్వే రాళ్లపై, పాసు పుస్తకాలపై గత పాలకుల బొమ్మలను తొలగించి, అధికారిక రాజముద్రతో కూడిన కొత్త పుస్తకాలను పంపిణీ చేయడం విశేషం.

ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు 'వాట్సాప్ గవర్నెన్స్' (మన మిత్ర) వంటి ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టారు. దీనివల్ల కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే శ్రమ తగ్గింది. అవినీతికి ఆస్కారం లేకుండా ఆటో-మ్యూటేషన్ ప్రక్రియను వంద శాతం అమలు చేస్తున్నారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ కాగానే భూమి రికార్డులు వెంటనే మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహించిన 17 వేల గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. ముఖ్యంగా డీఆర్వోల వద్ద ఉన్న అధికారాలను ఆర్డీవోలకు వికేంద్రీకరించడం ద్వారా అర్జీల పరిష్కారం వేగవంతమైంది.

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఇనాం భూముల సమస్యపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22ఏ  నుంచి తొలగించడంతో వేలాది మంది రైతులకు ఉపశమనం లభించింది. అలాగే, 2016 కంటే ముందు ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్‌లో పట్టాలు పొందిన పేదలకు తమ ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. వారసత్వంగా వచ్చే ఆస్తుల రిజిస్ట్రేషన్ ఫీజులను భారీగా తగ్గించి, కేవలం 100 నుండి 1,000 రూపాయలకే ఆ పని పూర్తయ్యేలా సంస్కరణలు తెచ్చారు.

భవిష్యత్తులో భూ వివాదాలు లేని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రికార్డుల భద్రత కోసం బ్లాక్ చైన్ సాంకేతికతను వాడుతూ, ప్రతి పాసు పుస్తకానికి క్యూఆర్ కోడ్, యూనిక్ నంబర్ కేటాయించారు. దీనివల్ల ఎక్కడ ఉన్నా తమ భూమి వివరాలను యజమానులు ఫోన్ ద్వారా సరిచూసుకోవచ్చు. భూ ఆక్రమణలను అరికట్టేందుకు 'ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్-2024' వంటి కఠిన చట్టాలను అమలులోకి తెచ్చి, సామాన్యుల ఆస్తులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. మొత్తానికి, 22 నెలల పాలనలో రెవెన్యూ శాఖ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…