LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Minister Narayana: 40 ఏళ్ల నాటి సమస్యకు నెల రోజుల్లోనే పరిష్కారం.. ఇంటింటికీ వెళ్లి.. పేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్య!

Minister Narayana: నగర అభివృద్ధిపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా నగరంలో మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు . పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా పొర్లుకట్ట ప్రాంతంలో 1.2 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను స్వ…

AndhraPravasi News Desk 2 min read
Minister Narayana: 40 ఏళ్ల నాటి సమస్యకు నెల రోజుల్లోనే పరిష్కారం.. ఇంటింటికీ వెళ్లి.. పేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్య!
  • జూన్ 12 కల్లా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పూర్తి…
     
  • Politics: లోకేష్ విజన్‌తో టిడ్కో ప్రాంగణంలో హైటెక్ పాఠశాల…

Minister Narayana: నగర అభివృద్ధిపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో  భాగంగా నగరంలో మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు . పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా పొర్లుకట్ట ప్రాంతంలో 1.2 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను స్వయంగా పరిశీలించారు .40 ఏళ్ల నాటి స్థానికుల సమస్యకు నెల రోజుల్లోనే పరిష్కారం చూపుతామన్నారు. నాణ్యతలో రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతీ వీధిలో పర్యటించి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.​ అనంతరం ఆత్మకూరు బస్టాండ్ వద్ద 28 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసారు. ఇచ్చిన మాట ప్రకారం నిర్ణీత కాలంలోనే రోడ్డు పూర్తి చేస్తామన్నారు. జేమ్స్ గార్డెన్‌లో ఎన్టీఆర్ సుజల 30వ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. భవిష్యత్తులో నగరవ్యాప్తంగా 120 ప్లాంట్లు ఏర్పాటు చేసి, రోజుకు 6 లక్షల లీటర్ల మినరల్ వాటర్‌ను కేవలం 2 రూపాయలకే 20 లీటర్ల చొప్పున అందజేస్తామని ప్రకటించారు. అనంతరం 53 ,54 వ డివిజన్ లలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు టిడ్కో సముదాయంలో వైఎస్సార్సీపీ నిర్వీర్యం చేసిన పాఠశాల భవనాలను  పరిశీలించారు. వెంకటేశ్వరపురం సచివాలయంలో అధికారులు,సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలుపై దిశానిర్దేశం చేశారు.సచివాలయానికి వచ్చే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అంకితభావంతో పనిచేయాలని సూచించారు .అనంతరం  మంత్రి మీడియాతో మాట్లాడుతూ మాది పేదల పక్షపాత ప్రభుత్వమని తెలిపారు. ప్రతీ పేదవాడికీ కూడు, గూడు, నీడ కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమన్నారు. పేదరిక నిర్మూలనకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన 5 వేల టిడ్కో ఇళ్లను పునరుద్ధరించడమే కాకుండా, యువనేత లోకేష్ విజన్‌కు అనుగుణంగా ఆ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి పాఠశాలను నిర్మించి పేద విద్యార్థులకు అత్యున్నత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.జూన్ 12 కల్లా నగరంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి, నెల్లూరును ఒక సుందర నగరంగా తీర్చిదిద్ది రాష్ట్రానికే రోల్ మోడల్‌గా నిలబెడతాననన్నారు.

ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పెర్సన్ తాళ్ళపాక అనూరాధ, టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి, టీడీపీ నేతలు ధర్మవరం సుబ్బారావు,పెంచల బాబు, పోకల రవి, సుజన్, జహీర్, జమీర్, జంషీద్, సుధాకర్ రెడ్డి, కార్పొరేషన్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…